PM Modi: ‘ప్రధానమంత్రి జన్ ధన్ యోజన’కు పదేళ్లు.. 53 కోట్ల ఖాతాల్లో రూ. 2లక్షల కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన(PMJDY) నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అలాగే ఈ పథకం కింద ఇప్పటివరకు తెరిచిన ఖాతాల సంఖ్యను సోషల్ మీడియాలో దేశప్రజలకు తెలియజేశారు. గత దశాబ్ద కాలంలో 53 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు ప్రారంభించామని, వాటిలో 2 లక్షల 31 వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయని ప్రధాని చెప్పారు.
ఈ రోజు మనం ఒక ప్రత్యేక సందర్భాన్ని జరుపుకుంటున్నాము – #10YearsOfJanDhan అని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో రాశారు. ఈ పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన లబ్ధిదారులందరికీ అభినందనలు తెలిపారు. జన్ ధన్ యోజన ప్రజలను ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ పథకం జాతికి అంకితం చేశారు. దీని ద్వారా కోట్లాది ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, యువత, సమాజంలోని అట్టడుగు వర్గాలకు గౌరవం కలిగింది.
Also Read
Read Also:Jay Shah: క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ నుండి ఐసీసీ అధ్యక్షుడిగా ప్రయాణం ఇలా..
Today, we mark a momentous occasion— #10YearsOfJanDhan. Congratulations to all the beneficiaries and compliments to all those who worked to make this scheme a success. Jan Dhan Yojana has been paramount in boosting financial inclusion and giving dignity to crores of people,… pic.twitter.com/VgC7wMcZE8
— Narendra Modi (@narendramodi) August 28, 2024
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక చేరిక
2014 ఆగస్టు 28న ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో చేరేందుకు గత పదేళ్లలో దేశవ్యాప్తంగా విపరీతమైన ఉత్సాహం కనిపించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక చేరిక కార్యక్రమంగా మారింది. ఇది కనీస బ్యాలెన్స్ అవసరం లేని ఖాతా.
పురుషుల కంటే మహిళలే ఎక్కువ
53 కోట్లకు పైగా ఖాతాల్లో 55.6 శాతం మహిళల ఖాతాలేనని ప్రభుత్వం వెల్లడించింది. అంటే ఈ ఖాతాలో చేరిన వారి సంఖ్య పురుషుల కంటే మహిళలే ఎక్కువ. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఖాతాదారుల సంఖ్య ఎక్కువగా ఉంది. 53 కోట్ల మందిలో 35 కోట్ల మంది గ్రామాలు, పట్టణాలకు చెందిన వారు.
Read Also:Govt Schools Closed: గంగానదిలో పెరిగిన నీటిమట్టం.. పాట్నాలో 76 గవర్నమెంట్ స్కూల్స్ మూసివేత
తాజావార్తలు
-
MS Dhoni-IPL 2027: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పేసిన సురేశ్ రైనా!
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
-
Ramayana Epic: రణ్బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!