PM Modi: ‘ప్రధానమంత్రి జన్ ధన్ యోజన’కు పదేళ్లు.. 53 కోట్ల ఖాతాల్లో రూ. 2లక్షల కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన(PMJDY) నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అలాగే ఈ పథకం కింద ఇప్పటివరకు తెరిచిన ఖాతాల సంఖ్యను సోషల్ మీడియాలో దేశప్రజలకు తెలియజేశారు. గత దశాబ్ద కాలంలో 53 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు ప్రారంభించామని, వాటిలో 2 లక్షల 31 వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయని ప్రధాని చెప్పారు.
ఈ రోజు మనం ఒక ప్రత్యేక సందర్భాన్ని జరుపుకుంటున్నాము – #10YearsOfJanDhan అని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో రాశారు. ఈ పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన లబ్ధిదారులందరికీ అభినందనలు తెలిపారు. జన్ ధన్ యోజన ప్రజలను ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ పథకం జాతికి అంకితం చేశారు. దీని ద్వారా కోట్లాది ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, యువత, సమాజంలోని అట్టడుగు వర్గాలకు గౌరవం కలిగింది.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
Read Also:Jay Shah: క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ నుండి ఐసీసీ అధ్యక్షుడిగా ప్రయాణం ఇలా..
Today, we mark a momentous occasion— #10YearsOfJanDhan. Congratulations to all the beneficiaries and compliments to all those who worked to make this scheme a success. Jan Dhan Yojana has been paramount in boosting financial inclusion and giving dignity to crores of people,… pic.twitter.com/VgC7wMcZE8
— Narendra Modi (@narendramodi) August 28, 2024
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక చేరిక
2014 ఆగస్టు 28న ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో చేరేందుకు గత పదేళ్లలో దేశవ్యాప్తంగా విపరీతమైన ఉత్సాహం కనిపించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక చేరిక కార్యక్రమంగా మారింది. ఇది కనీస బ్యాలెన్స్ అవసరం లేని ఖాతా.
పురుషుల కంటే మహిళలే ఎక్కువ
53 కోట్లకు పైగా ఖాతాల్లో 55.6 శాతం మహిళల ఖాతాలేనని ప్రభుత్వం వెల్లడించింది. అంటే ఈ ఖాతాలో చేరిన వారి సంఖ్య పురుషుల కంటే మహిళలే ఎక్కువ. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఖాతాదారుల సంఖ్య ఎక్కువగా ఉంది. 53 కోట్ల మందిలో 35 కోట్ల మంది గ్రామాలు, పట్టణాలకు చెందిన వారు.
Read Also:Govt Schools Closed: గంగానదిలో పెరిగిన నీటిమట్టం.. పాట్నాలో 76 గవర్నమెంట్ స్కూల్స్ మూసివేత
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!