Dhan Dhanya Yojana: రైతులకు మోడీ కానుక.. రూ.24 వేల కోట్ల ధన్ ధన్య పథకాన్ని ప్రారంభించిన ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhan Dhanya Yojana: దీపావళి పండుగ ముందు రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. శనివారం ఆయన రూ.24 వేల కోట్ల ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంభించారు. ప్రతి పొలానికి నీటిపారుదల సౌకర్యాలను అందించడం, పంట ఉత్పాదకతను పెంచడం, రైతులకు సులభమైన రుణ సౌకర్యాలను అందించడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులను ప్రోత్సహించడం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం ప్రధాన లక్ష్యం. ఏ జిల్లాల రైతులు ప్రధానమంత్రి ధన్ ధన కృషి యోజన పథకం ద్వారా ప్రయోజనం పొందుతారో తెలుసుకుందాం.
READ ALSO: Jagga Reddy: కులం పేరు చెప్పుకుని రాలేదు.. జనం మధ్య నుంచే వచ్చా: జగ్గారెడ్డి
Also Read
ఎన్ని జిల్లాలు ప్రయోజనం పొందుతాయో తెలుసా..
ఢిల్లీ పూసాలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 100 ఆకాంక్ష జిల్లాల జాబితాను అభివృద్ధి చేశారు. దిగుబడి పరంగా దేశ వ్యాప్తంగా ఈ జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ఇక్కడ రైతుల ఆదాయం, పంట ఉత్పాదకత ఇతర జిల్లాల కంటే గణనీయంగా తక్కువగా ఉన్నాయి. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కింద, కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాలను 2030 నాటికి జాతీయ సగటుకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకంలో భాగం అయిన100 జిల్లాలు 11 మంత్రిత్వ శాఖల నుంచి 36కి పైగా పథకాల నుంచి కూడా ప్రయోజనం పొందనున్నాయి. ధన్ ధాన్య కృషి యోజన ద్వారా 17 మిలియన్ల మంది రైతులు ప్రయోజనం పొందుతారని అంచనా.
మూడు నియమాలపై జిల్లాల ఎంపిక..
ముందుగా – పొలం ఎంత దిగుబడిని ఇస్తుంది.
రెండవది – ఒక పొలాన్ని ఎన్నిసార్లు సాగు చేస్తారు.
మూడవది – రైతులకు ఎంత రుణ సౌకర్యం లేదా పెట్టుబడి సౌకర్యం అందుబాటులో ఉంది.
ప్రారంభమైన పల్స్ స్వయం సమృద్ధి మిషన్..
ప్రధానమంత్రి మోడీ పప్పుధాన్యాల స్వావలంబన మిషన్ను కూడా శనివారం ప్రారంభించారు. “పప్పుధాన్యాల స్వావలంబన మిషన్ కేవలం పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచే లక్ష్యం మాత్రమే కాదు, మన భవిష్యత్ తరాలకు సాధికారత కల్పించే ప్రచారం కూడా” అని ప్రధాని అన్నారు. గత 11 ఏళ్లుగా, ప్రభుత్వం రైతులను శక్తివంతం చేయడానికి, వ్యవసాయంలో పెట్టుబడులను పెంచడానికి నిరంతరం కృషి చేస్తోంది. మెరుగైన విత్తనాలు, నిల్వ సౌకర్యాలు, వారి ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా రైతులు నేరుగా ప్రయోజనం పొందుతారు” అని ప్రధాని చెప్పారు. రైతుల కోసం ఒకేసారి రెండు పథకాలను ప్రారంభించినట్లు ప్రధాని పేర్కొన్నారు. ఈ రెండు పథకాలు భారతదేశ రైతుల అదృష్టాన్ని మారుస్తాయని ఆయన చెప్పారు. ఈ రెండు పథకాలపై ప్రభుత్వం రూ.35 వేల కోట్ల పైగా ఖర్చు చేస్తుందని ప్రధాని చెప్పారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!