Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేటితో ముగియనున్న ప్రభాకర్ రావు విచారణ!

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ్టితో ముగియనున్న ప్రభాకర్ రావు విచారణ
  • సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు వారాల పాటు ప్రభాకర్ రావును విచారిస్తున్న సిట్
  • ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టిన సిట్
  • రాజకీయ నేతల పాత్రపై ఆధారాలు సేకరించిన సిట్
Prabhakar Rao

Prabhakar Rao

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్‌ ప్రభాకర్ రావు విచారణ ఇవాళ్టితో ముగియనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు వారాల పాటు ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బృందం విచారిస్తోంది. డిసెంబర్ 26వ తేదీన ప్రభాకర్ రావును విడిచి పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండో వారం విచారణలో ప్రభాకర్ రావు నుంచి సిట్ బృందం కీలక సమాచారం రాబట్టింది. మొదట విచారణకు సహకరించని ప్రభాకర్ రావు.. పూర్తి ఆధారాలు ముందు ఉంచడంతో కొన్నిటికి సమాధానాలు చెప్పినట్టు సమాచారం. ప్రభాకర్ రావు తన పై అధికారుల పేర్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారట.

Also Read: Unbreakable Cricket Records: 52 ఏళ్ల వయసులో అరంగేట్రం, 10 పరుగులకు 10 వికెట్లు.. ఈ పది రికార్డులు బద్దలు కొట్టడం అసాధ్యం!

ఫోన్ టాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నిందితులంతా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే నెంబర్లను టాపింగ్ చేశామని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ట్యాపింగ్ చేసిన సమాచారం ప్రభాకర్ రావు పై వారికి ఏ విధంగా చేరవేశాడని దానిపైనే సిట్ దర్యాప్తు చేస్తోంది. టాపింగ్ కేసులో ఒక పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారింది. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్‌గా పనిచేసిన టైంలో పెన్ డ్రైవ్లో టాపింగ్ వివరాలు స్టోర్ చేశారట. రెండు వారాల విచారణకు సంబంధించిన రిపోర్ట్ ను సుప్రీంకోర్టుకు అందించనున్న సిట్ బృందం. జనవరి 16న ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్తో పాటు ఫోన్ టాపింగ్ కేసులో సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఇక రేపటి నుంచి సిట్ ఏం చేయబోతుందనేదే ఉత్కంఠగా మారింది. ఫోన్ టాపింగ్లో రాజకీయ నాయకుల పాత్రపై సిట్ బృందం ఆధారాలు సేకరించింది.