West Bengal: బెంగాల్లో పేలుడు ఘటనపై NIA విచారణ కోరుతూ పిటిషన్.. నిరాకరించిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లోని అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో ఆదివారం జరిగిన పేలుడు ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ కోరుతూ బీజేపీ నేత సువేందు అధికారి పిల్ వేశారు. అయితే దానిని విచారించేందుకు కోల్కతా హైకోర్టు నిరాకరించింది. దుత్తాపుకూర్లో పేలుడు జరిగిన ప్రదేశంలో ఆర్డిఎక్స్(RDX) ఉండొచ్చని పేర్కొంటూ బీజేపీ నేత ఈ పిల్ దాఖలు చేశారు.
Read Also: LPG Cylinder Price: గ్యాస్ సిలిండర్ పై రూ. 200 రాయితీ
Also Read
- 600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
- Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
- IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
- Virat Kohli: "నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు".. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
మరోవైపు “తక్షణ పిల్ వేయవల్సిన అవసరం ఏమిటి? దర్యాప్తు పట్టాలు తప్పుతోంది” అని పిటిషనర్ను కోర్టు ప్రశ్నించింది. NIA బృందం సోమవారం పేలుడు జరిగిన ప్రదేశాన్ని సందర్శించిందని.. జాతీయ దర్యాప్తు సంస్థ తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ బిల్వాదల్ భట్టాచార్య కోర్టుకు తెలిపారు. పేలుడు పదార్థాల చట్టంలోని నిబంధనలను రాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చలేదని కూడా ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపణలపై మమతా బెనర్జీ సర్కార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అతను పేలుడు పదార్థాల నిపుణుడిలా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. మరోవైపు ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించాలని బీజేపీ పట్టుబడుతుంది. మరోవైపు.. పేలుళ్లను నివారించడానికి, కార్మికుల భద్రతను నిర్ధారించడానికి రాష్ట్రంలో గ్రీన్ పటాకుల యూనిట్ల క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది.
Read Also: Siva Nirvana: ఖుషీ కోసం శివ నిర్వాణకి 12 కోట్ల రెమ్యునరేషన్.. అసలు సంగతి చెప్పేశాడు!
మే లో.. తూర్పు మిడ్నాపూర్లోని ఎగ్రాలో అక్రమ క్రాకర్ యూనిట్లో పేలుడు సంభవించి 12 మంది మరణించారు. అదే నెలలో కోల్కతాకు 26 కిలోమీటర్ల దూరంలోని బడ్జ్ బడ్జ్ వద్ద అక్రమ బాణసంచా తయారీ యూనిట్లో జరిగిన పేలుడులో మైనర్తో సహా ఒక కుటుంబంలోని ముగ్గురు మరణించారు. కొంత మందికి గాయాలయ్యాయి. తాజాగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో అక్కడ రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు రేపుతుంది.
తాజావార్తలు
-
Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..