West Bengal: బెంగాల్లో పేలుడు ఘటనపై NIA విచారణ కోరుతూ పిటిషన్.. నిరాకరించిన కోర్టు
పశ్చిమ బెంగాల్లోని అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో ఆదివారం జరిగిన పేలుడు ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ కోరుతూ బీజేపీ నేత సువేందు అధికారి పిల్ వేశారు. అయితే దానిని విచారించేందుకు కోల్కతా హైకోర్టు నిరాకరించింది. దుత్తాపుకూర్లో పేలుడు జరిగిన ప్రదేశంలో ఆర్డిఎక్స్(RDX) ఉండొచ్చని పేర్కొంటూ బీజేపీ నేత ఈ పిల్ దాఖలు చేశారు.
Read Also: LPG Cylinder Price: గ్యాస్ సిలిండర్ పై రూ. 200 రాయితీ
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
మరోవైపు “తక్షణ పిల్ వేయవల్సిన అవసరం ఏమిటి? దర్యాప్తు పట్టాలు తప్పుతోంది” అని పిటిషనర్ను కోర్టు ప్రశ్నించింది. NIA బృందం సోమవారం పేలుడు జరిగిన ప్రదేశాన్ని సందర్శించిందని.. జాతీయ దర్యాప్తు సంస్థ తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ బిల్వాదల్ భట్టాచార్య కోర్టుకు తెలిపారు. పేలుడు పదార్థాల చట్టంలోని నిబంధనలను రాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చలేదని కూడా ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపణలపై మమతా బెనర్జీ సర్కార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అతను పేలుడు పదార్థాల నిపుణుడిలా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. మరోవైపు ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించాలని బీజేపీ పట్టుబడుతుంది. మరోవైపు.. పేలుళ్లను నివారించడానికి, కార్మికుల భద్రతను నిర్ధారించడానికి రాష్ట్రంలో గ్రీన్ పటాకుల యూనిట్ల క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది.
Read Also: Siva Nirvana: ఖుషీ కోసం శివ నిర్వాణకి 12 కోట్ల రెమ్యునరేషన్.. అసలు సంగతి చెప్పేశాడు!
మే లో.. తూర్పు మిడ్నాపూర్లోని ఎగ్రాలో అక్రమ క్రాకర్ యూనిట్లో పేలుడు సంభవించి 12 మంది మరణించారు. అదే నెలలో కోల్కతాకు 26 కిలోమీటర్ల దూరంలోని బడ్జ్ బడ్జ్ వద్ద అక్రమ బాణసంచా తయారీ యూనిట్లో జరిగిన పేలుడులో మైనర్తో సహా ఒక కుటుంబంలోని ముగ్గురు మరణించారు. కొంత మందికి గాయాలయ్యాయి. తాజాగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో అక్కడ రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు రేపుతుంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!