West Bengal: బెంగాల్లో పేలుడు ఘటనపై NIA విచారణ కోరుతూ పిటిషన్.. నిరాకరించిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లోని అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో ఆదివారం జరిగిన పేలుడు ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ కోరుతూ బీజేపీ నేత సువేందు అధికారి పిల్ వేశారు. అయితే దానిని విచారించేందుకు కోల్కతా హైకోర్టు నిరాకరించింది. దుత్తాపుకూర్లో పేలుడు జరిగిన ప్రదేశంలో ఆర్డిఎక్స్(RDX) ఉండొచ్చని పేర్కొంటూ బీజేపీ నేత ఈ పిల్ దాఖలు చేశారు.
Read Also: LPG Cylinder Price: గ్యాస్ సిలిండర్ పై రూ. 200 రాయితీ
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
మరోవైపు “తక్షణ పిల్ వేయవల్సిన అవసరం ఏమిటి? దర్యాప్తు పట్టాలు తప్పుతోంది” అని పిటిషనర్ను కోర్టు ప్రశ్నించింది. NIA బృందం సోమవారం పేలుడు జరిగిన ప్రదేశాన్ని సందర్శించిందని.. జాతీయ దర్యాప్తు సంస్థ తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ బిల్వాదల్ భట్టాచార్య కోర్టుకు తెలిపారు. పేలుడు పదార్థాల చట్టంలోని నిబంధనలను రాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చలేదని కూడా ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపణలపై మమతా బెనర్జీ సర్కార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అతను పేలుడు పదార్థాల నిపుణుడిలా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. మరోవైపు ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించాలని బీజేపీ పట్టుబడుతుంది. మరోవైపు.. పేలుళ్లను నివారించడానికి, కార్మికుల భద్రతను నిర్ధారించడానికి రాష్ట్రంలో గ్రీన్ పటాకుల యూనిట్ల క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది.
Read Also: Siva Nirvana: ఖుషీ కోసం శివ నిర్వాణకి 12 కోట్ల రెమ్యునరేషన్.. అసలు సంగతి చెప్పేశాడు!
మే లో.. తూర్పు మిడ్నాపూర్లోని ఎగ్రాలో అక్రమ క్రాకర్ యూనిట్లో పేలుడు సంభవించి 12 మంది మరణించారు. అదే నెలలో కోల్కతాకు 26 కిలోమీటర్ల దూరంలోని బడ్జ్ బడ్జ్ వద్ద అక్రమ బాణసంచా తయారీ యూనిట్లో జరిగిన పేలుడులో మైనర్తో సహా ఒక కుటుంబంలోని ముగ్గురు మరణించారు. కొంత మందికి గాయాలయ్యాయి. తాజాగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో అక్కడ రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు రేపుతుంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?