Perni Nani: స్పీకర్కి మెడికల్ కాలేజీ కనిపించడం లేదంట.. వైఎస్ జగన్ వెళ్లి చూపిస్తారు!
- వైసీపీ అధినేత వైఎస్ జగన్ నర్సీపట్నం వెళ్తున్నారు
- అనుమతి లేదు అంటే స్పీకర్ అంటే గౌరవం లేదా?
- స్పీకర్కి మెడికల్ కాలేజీ కనిపించడం లేదంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆహ్వానం మేరకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నర్సీపట్నం వెళ్తున్నారు అని.. పోలీసులు ఇప్పుడు అనుమతి లేదు అంటే స్పీకర్ అంటే గౌరవం లేదా? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. స్పీకర్కి మెడికల్ కాలేజీ కనిపించడం లేదని, జగన్ వెళ్లి చూపిస్తారని విమర్శించారు. మెడికల్ కాలేజీకి సంబంధించిన జీవోను, నిర్మాణాలను, పనులు ఆపివేయాలని ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా చూపిస్తామని తెలిపారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తప్పు అని కోటి సంతకాలతో ప్రజల అభిప్రాయాలు తీసుకుని గవర్నర్ను కలుస్తాం అని పేర్ని నాని చెప్పారు.
‘కూటమి ప్రభుత్వం శ్రీరంగ నీతులు చెప్పి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటోంది. 11 మెడికల్ కళాశాలలు అమ్మకానికి పెట్టారు. డబ్బు కోసం ఏ గడ్డైనా కరిచే వీళ్ల నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతాం. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆహ్వానం మేరకు వైఎస్ జగన్ నర్సీపట్నం వెళ్తున్నారు. పోలీసులు అనుమతి లేదు అంటే స్పీకర్ అంటే గౌరవం లేదా?. స్పీకర్కి మెడికల్ కాలేజీ కనిపించడం లేదంట, జగన్ వెళ్లి చూపిస్తారు. ఆ జీవోను, నిర్మాణాలను, పనులు ఆపివేయాలని ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా చూపిస్తాం. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తప్పు అని కోటి సంతకాలతో ప్రజల అభిప్రాయాలు తీసుకుని గవర్నర్ను కలుస్తాం’ అని పేర్ని నాని తెలిపారు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
Also Read: Vijayawada Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!
‘కల్తీ లిక్కర్ మాఫియాపై మంత్రి కొల్లు రవీంద్ర ఎందుకు మాట్లాడటం లేదు. గతంలో డిస్ట్రలరీలో తయారు అయిన మద్యంపై విషం చిమ్మారు. ఇవాళ అదే డిస్ట్రలరీల నుంచే మద్యం వస్తుంటే ఏం చేస్తున్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లా ఫ్రాంచైజీలు ఇచ్చారు. ఆఫ్రికా పంపి ట్రైనింగ్ ఇప్పించారు. డబ్బు కోసం అశుద్ధం తినటానికి అయినా సిద్ధంగా ఉన్నారు. దొంగలు ఒక్కొక్కరుగా బయట పడుతున్నారు. తప్పులు పనులతో అంటకాగిన వాళ్లకు లెక్కలతో సహా చెల్లిస్తాం అని జగన్ చెప్పారు. ఈ ప్రభుత్వానికి మంగళం పాడే సమయం వచ్చింది. 16 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం తయారీ జరుగుతుంటే మంత్రి కొల్లు రవీంద్ర ఏం చేస్తున్నాడు. వేర్ ఈజ్ ఎక్సైజ్ మినిస్టర్. మంత్రికి మూటలు వెళ్తున్నాయి, అందుకే సైలెంట్ గా ఉన్నాడు. ప్రజలు తిరగబడి తరిమి కొట్టే రోజులు వస్తాయి’ అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!