CV Anand: బాధ్యత ఉండక్కర్లా.. ఏంటీ ఈ చిల్లర వేషాలు!
- మొదటిసారి ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ కైవసం
- అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది
- రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న వేలాది మంది
- హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన టైటిల్ పోరులో ఆర్సీబీ సంచలన విజయం సాధించి మొదటిసారి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఆర్సీబీ సాధించిన విజయాన్ని తమ విజయంగా భావించారు. బాణాసంచా కాలుస్తూ సంబరాల్లో మునిగితేలారు.
మెట్రో సిటీలలో అభిమానం శృతి మించింది. రోడ్లపైకి వచ్చి క్రాకర్స్ కలుస్తూ అలజడి సృష్టించారు. వాహనదారుల్ని రోడ్డుపై నిలిపివేసి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. కొందరు బట్టలిప్పి నానా హంగామా చేశారు. ఆర్టీసీ బస్సులపై ఎక్కి ఆర్సీబీ జెండాలతో నినాదాలు పలికారు. ఇంకొందరు కార్లపైకి ఎక్కి రచ్చ రచ్చ చేశారు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి గూండాల్లా ప్రవర్తించారు. ఏకంగా తెలంగాణ సెక్రటేరియట్ ముందు బాణాసంచా కాలుస్తూ నానా హంగామా చేశారు. బట్టలిప్పి బస్సులపై, వచ్చిపోయే లారీలపైకి ఎక్కి పైశాచిక ఆనందం పొందారు. ఆర్సీబీ చాన్నాళ్ల తర్వాత కప్ గెలవడంతో సంతోషం ఉండొచ్చు.. బట్ ఇలా శృతిమించి ప్రవర్తిస్తే అది సొసైటీకి చెడ్డ పేరు తీసుకొస్తుంది.
Also Read
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Foods for Naturally Glowing Skin: మెరిసే చర్మం కావాలా? ఈ ఫుడ్ తీసుకుంటే సహజ కాంతి మీ సొంతం..!
Also Read: Eatala Rajendar: అంతా నిజమే చెప్తానని ఈటల ప్రమాణం.. అన్నీ కేబినెట్ నిర్ణయం మేరకే!
హైదరాబాద్ లాంటి మహానగరంలో జూన్ 3 అర్ధరాత్రి జరిగిన సంఘటనలపై ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బ తీసేలా అభిమానులు ప్రవర్తించారన్న పేరు వచ్చింది. దీనిపై హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందిస్తూ.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘బెంగళూరు తొక్కిసలాట చూసినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామని ఆశ్చర్యం కలిగింది. ఆర్సీబీ ప్రపంచకప్ గెలవలేదు. ఆర్సీబీ జాతీయ జట్టు కాదు. బిజినెస్ పరంగా నడిచే ఓ ఐపీఎల్ ఇది. అర్థరాత్రి 12 గంటలకు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్లపైకి భారీ సంఖ్యలో యువకులు రావడం ఆందోళన కలిగించింది. వాళ్ళని అదుపుచేసేందుకు ఉన్న పోలీసులు చాలక అదనపు బలగాలను దించాల్సి వచ్చింది. పౌరులు భయం, బాధ్యత కలిగి ఉండాలి’ అని సీవీ ఆనంద్ అన్నారు.
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!