CV Anand: బాధ్యత ఉండక్కర్లా.. ఏంటీ ఈ చిల్లర వేషాలు!
- మొదటిసారి ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ కైవసం
- అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది
- రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న వేలాది మంది
- హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన టైటిల్ పోరులో ఆర్సీబీ సంచలన విజయం సాధించి మొదటిసారి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఆర్సీబీ సాధించిన విజయాన్ని తమ విజయంగా భావించారు. బాణాసంచా కాలుస్తూ సంబరాల్లో మునిగితేలారు.
మెట్రో సిటీలలో అభిమానం శృతి మించింది. రోడ్లపైకి వచ్చి క్రాకర్స్ కలుస్తూ అలజడి సృష్టించారు. వాహనదారుల్ని రోడ్డుపై నిలిపివేసి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. కొందరు బట్టలిప్పి నానా హంగామా చేశారు. ఆర్టీసీ బస్సులపై ఎక్కి ఆర్సీబీ జెండాలతో నినాదాలు పలికారు. ఇంకొందరు కార్లపైకి ఎక్కి రచ్చ రచ్చ చేశారు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి గూండాల్లా ప్రవర్తించారు. ఏకంగా తెలంగాణ సెక్రటేరియట్ ముందు బాణాసంచా కాలుస్తూ నానా హంగామా చేశారు. బట్టలిప్పి బస్సులపై, వచ్చిపోయే లారీలపైకి ఎక్కి పైశాచిక ఆనందం పొందారు. ఆర్సీబీ చాన్నాళ్ల తర్వాత కప్ గెలవడంతో సంతోషం ఉండొచ్చు.. బట్ ఇలా శృతిమించి ప్రవర్తిస్తే అది సొసైటీకి చెడ్డ పేరు తీసుకొస్తుంది.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
Also Read: Eatala Rajendar: అంతా నిజమే చెప్తానని ఈటల ప్రమాణం.. అన్నీ కేబినెట్ నిర్ణయం మేరకే!
హైదరాబాద్ లాంటి మహానగరంలో జూన్ 3 అర్ధరాత్రి జరిగిన సంఘటనలపై ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బ తీసేలా అభిమానులు ప్రవర్తించారన్న పేరు వచ్చింది. దీనిపై హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందిస్తూ.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘బెంగళూరు తొక్కిసలాట చూసినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామని ఆశ్చర్యం కలిగింది. ఆర్సీబీ ప్రపంచకప్ గెలవలేదు. ఆర్సీబీ జాతీయ జట్టు కాదు. బిజినెస్ పరంగా నడిచే ఓ ఐపీఎల్ ఇది. అర్థరాత్రి 12 గంటలకు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్లపైకి భారీ సంఖ్యలో యువకులు రావడం ఆందోళన కలిగించింది. వాళ్ళని అదుపుచేసేందుకు ఉన్న పోలీసులు చాలక అదనపు బలగాలను దించాల్సి వచ్చింది. పౌరులు భయం, బాధ్యత కలిగి ఉండాలి’ అని సీవీ ఆనంద్ అన్నారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!