Pemmasani: పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు జరిగిన సర్వసభ్య సమావేశంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రజాగళం యాత్ర నిర్వహణకు అబ్జర్వర్ గా విచ్చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి ఆహ్వానం పలికారు. మరో 10 రోజులు అందరూ ఏకతాటిపైకి వచ్చి పని చేస్తే విజయం సాధిస్తామని ఆయన అన్నారు. పార్టీలో నిజంగా కష్టపడ్డ కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుంది.. ఎవరు కష్టపడుతున్నారో, ఎవరు దూరంగా ఉంటున్నారో తెలుసుకోవడం కష్టమైన పని ఏమి కాదని ఆయన చెప్పారు. కార్యకర్తల్లో కనిపిస్తున్న ఉత్సాహం సఫలీకృతమయ్యే సమయం ఆసన్నం అయిందన్నారు. సాయంత్రం జరిగే ప్రజాగళం యాత్ర, భారీ బహిరంగ సభను సమిష్టిగా నడిపించి విజయవంతం చేద్దామన్నారు.
Read Also: Bomb Threat : నిన్న ట్వీట్.. నేడు పాఠశాలల్లో బాంబులు.. బీజేపీ నాయకుడి పోస్ట్పై ఆప్ ప్రశ్నలు
Also Read
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
- Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
కాగా, దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజాగళం యాత్రకు టీడీపీ- జనసేన- బీజేపీ నాయకులు భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ప్రచార కార్యక్రమాల నుంచే ప్రజల్లో అత్యంత ప్రాముఖ్యతను సంపాదించుకున్న నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్ అని తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్న రాజధాని ప్రాంతానికి పార్లమెంట్ అభ్యర్థిగా రావడం సాధారణ విషయం కాదు.. అలాంటి వ్యక్తిని చంద్రబాబు ఏరి కోరి ఎన్నిక చేశారని దేవినేని ఉమ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబత్తుని చిట్టిబాబు, టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, కార్పొరేటర్ పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు. అలాగే, తెనాలిలో జరగిన ప్రజాగళం భారీ బహిరంగ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో కలిసి గుంటూరు పార్లమెంట్ ఎన్డీయే కూటమి అభ్యర్థిపెమ్మసాని చంద్రశేఖర్, నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Maruti WagonR Flex Fuel: దేశపు తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు మారుతి వాగన్ఆర్ ఆవిష్కరణ.. పెట్రోల్ ఖర్చు, కాలుష్యానికి చెక్!
-
AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
India S-400 Squadron: భారత్కు రష్యా నుంచి నాలుగో S-400 స్క్వాడ్రన్.. దేశ వైమానిక రక్షణ మరింత పటిష్టం
-
Jos Buttler: నెహ్రా నిర్ణయంతో షాకైన జోస్ బట్లర్.. గుజరాత్ ఫైనల్ ఓటమి వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!