Peddi: బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న భారీ రూరల్ యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంటున్నట్లు సమాచారం. తాజాగా ఈ క్రేజీ సినిమా నుంచి సూపర్ అప్డేట్ వచ్చింది. ఈ ప్యాన్ ఇండియా సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కళ్లు చెదిరే డీల్కు దక్కించుకున్నట్లు టాలీవుడ్ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
READ ALSO: MSVG : 4 రోజులు.. 200 కోట్లు.. మెగా మాస్ ఆన్ డ్యూటీ!
ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి ఇంకా అఫియల్గా ప్రకటన రావాల్సి ఉంది. ప్యాన్ ఇండియా స్థాయిలో మార్చ్ 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు సూపర్ హిట్గా నిలిచాయి. ఇందులో వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ‘అప్పలసూరి’ పాత్రలో కనిపించనున్నాడు. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్గా నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే బోమన్ ఇరానీ, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కూడా భాగమైన ఈ సినిమా మార్చి 27, 2026న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్గా రిలీజ్ కానుంది.
READ ALSO: Anasuya: అనసూయపై కామెంట్స్..జర్నలిస్టులు సహా 72 మందిపై కేసు
