Gidugu Rudraraju: రైతుల పరిస్థితి దుర్భరం.. సీఎం వెంటనే కరువు మండలాలు ప్రకటించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gidugu Rudraraju: ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది.. సీఎం వైఎస్ జగన్ వెంటనే కరువు మండలాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ వదిలి రైతుల కష్టాలపై దృష్టి సారించాలన్న ఆయన.. సీఎం జగన్ పొలం బాట పడితే రైతుల కష్టాలు తెలుస్తాయి.. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి రైతులు తీవ్రంగా నష్టపోయారు.. వర్షాభావం వలన పంట పొలాలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. ఈ సంవత్సరం రైతులు సుమారు 40 వేల ఎకరాలు సాగుచేయలేదన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.. ముఖ్యమంత్రి వెంటనే కరువు మండలాలు ప్రకటించాలని కోరారు.
Read Also: Nallapareddy: దొంగ ఏడుపులు ఏడ్చినా.. దత్తపుత్రుడుతో కలిసినా జగన్ వెంట్రుక కూడా పీకలేరు..!
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
ఇక, నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు గిడుగు రుద్రరాజు. ఇటీవల చిగ్బల్లాపూర్ లో ఏపీ రైతులు వలసపోతూ రోడ్డుప్రమాదంలో చనిపోవడం బాధాకరం అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగింది.. ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కూడా ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరారు.. సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాలకోసం పని చేయాలి.. మన రాష్ట్రంలో ఉపాధిలేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళుతున్నారు.. కరువు జిల్లాలు, మండలాలు ప్రకటించాలి.. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. సమాజంలో కులగణన జరిగితే.. ఆ సంఖ్యా బలాన్ని బట్టి ఆయా కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. రేపు గుంటూరులో ఓబీసీ సమావేశం నిర్వహించనున్నాం.. ఏపీ కాంగ్రెస్ లో మంచి నాయకులు ఉన్నారు.. రానున్న రోజుల్లో సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించి వారి సలహాలు తీసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ప్రకటించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!