Champions Trophy 2025: జై షాతో టచ్లోనే ఉన్నాం.. పాక్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ: పీసీబీ
- ఐసీసీ కొత్త ఛైర్మన్గా జై షా
- స్పందించిన పీసీబీ అధ్యక్షుడు మోసిన్ నక్వీ
- పాక్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ
PCB Chairman Mohsin Naqvi About Jay Shah: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్గా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా రావడం తమకేమీ ఆందోళన కలిగించడం లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు మోసిన్ నక్వీ అన్నారు. జై షాతో తాము టచ్లోనే ఉన్నామని తెలిపారు. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ పాక్లోనే జరగనుందని మోసిన్ స్పష్టం చేశారు. ఐసీసీ కొత్త ఛైర్మన్గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ అంశంపై అధికారికంగా స్పందించని నక్వీ.. తాజాగా ఓ కార్యక్రమంలో షాకు విషెష్ చెప్పారు.
Also Read: Paralympics 2024: భారత్ సిల్వర్ గెలిస్తే గోల్డ్ వచ్చింది.. కారణం ఏంటంటే?
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
తాజాగా మోసిన్ నక్వీ మాట్లాడుతూ… ‘బీసీసీఐ కార్యదర్శి జై షా మేం టచ్లోనే ఉన్నాం. ఐసీసీ ఛైర్మన్గా అతడు రావడం పట్ల మాకు ఆందోళన ఏమీ లేదు. ఏసీసీ మీటింగ్ సెప్టెంబర్ 8, 9 తేదీల్లో జరగనుంది. నేను మీటింగ్కు హాజరు కాను కానీ.. పీసీబీ నుంచి సల్మాన్ నసిర్ వెళ్తారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ కొత్త అధ్యక్షుడికి సంబంధించి నిర్ణయం కూడా తీసుకొనే అవకాశం ఉంది. ఏదేమైనా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాక్లోనే జరగనుంది. ట్రోఫీలో ఆడే అన్ని జట్లతో పీసీబీ సంప్రదింపులు చేస్తోంది’ అని చెప్పారు. టోర్నీని పాక్లో నిర్వహిస్తే తమ జట్టును పంపమని, తటస్థ వేదికపై మ్యాచులు నిర్వహిచాలని బీసీసీఐ పట్టుబడుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులు పాక్ వద్ద ఉన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!