Paytm : పేటీఎం వల్ల జనాల కష్టాలు.. జేబు నింపుకుంటున్న కంపెనీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paytm : Paytm పేమెంట్స్ బ్యాంక్పై RBI చర్య తర్వాత Paytm కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అయితే, ఈ చర్య అనేక ఇతర కంపెనీలను లాభాల పట్టేలా చేసింది. Paytm ఇబ్బందుల నుండి వారు చాలా ప్రయోజనం పొందుతున్నారు. ఆ కంపెనీలు మరేవో కాదు PhonePe, BHIM యాప్, Google Pay. ఇన్నాళ్లు భారతదేశంలో Paytm ఆధిపత్యం కొనసాగింది. ఈ కారణంగా ఈ కంపెనీలు ఇన్నాళ్లు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. జనవరి 31న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన పరిమితుల కారణంగా.. పేమెంట్స్ బ్యాంక్ ఇకపై డిపాజిట్లను ఆమోదించదు. అందువల్ల, ఇప్పుడు ఈ కంపెనీలు అమలు ఇదే విధానాన్ని అమలు చేయడాన్ని ప్రణాళికలు రెడీ చేస్తున్నాయి.
Read Also:Gold Price Today: బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
Also Read
- 8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
యాప్ ఇంటెలిజెన్స్ కంపెనీ యాప్ ఫిగర్స్ నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 3న PhonePeకి 2.79 లక్షల ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్లు వచ్చినట్లు మనీ కంట్రోల్ పేర్కొంది. జనవరి 27 నాటికి 1.92 లక్షల డౌన్లోడ్లతో పోలిస్తే ఇది 45 శాతం పెరిగింది. కంపెనీ యాప్ డౌన్లోడ్లు వారంలో 24 శాతానికి పైగా పెరిగాయి. ఇది కాకుండా, BHIM యాప్ డౌన్లోడ్లో దాదాపు 50 శాతం పెరుగుదల నమోదైంది. ఈ విషయంలో Google Pay ఇప్పటికీ నెమ్మదిగా ఉంది. దీని యాప్ డౌన్లోడ్లు 4.9 శాతం మాత్రమే పెరిగాయి.
Read Also:Chile : చిలీలో చల్లారని కార్చిచ్చు.. 131మంది మృతి, 370మంది గల్లంతు, 3000ఇళ్లు దగ్ధం
అయితే, ఆర్బీఐ చర్య తర్వాత వచ్చిన నష్టాలను భర్తీ చేసేందుకు Paytm ప్రయత్నిస్తోంది. కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడానికి ఇది SMS, ఇమెయిల్లను పంపడం ప్రారంభించింది. మీ డబ్బు మా వద్ద భద్రంగా ఉందని చెబుతోంది. RBI నిర్ణయం కారణంగా.. ఫిబ్రవరి 29 తర్వాత Paytm డిజిటల్ వాలెట్ వ్యాపారాన్ని కొనసాగించలేకపోవచ్చు. RBI Paytm పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ను One 97 కమ్యూనికేషన్స్కు బదిలీ చేస్తే వారు వ్యాపారాన్ని కొనసాగించవచ్చు. అయితే, ఈ చర్య తర్వాత ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడం కంపెనీకి పెద్ద సవాలుగా మారుతుంది. ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ Paytm డిజిటల్ చెల్లింపు రంగంపై బలమైన పట్టును కలిగి ఉంది. కానీ, ఆర్బిఐ చర్య తర్వాత కంపెనీ మార్కెట్ విలువలో 2.3 బిలియన్ డాలర్ల భారీ క్షీణత ఉంది. అలాగే, దాని మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు దాదాపు 39 శాతం పడిపోయాయి.
తాజావార్తలు
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!