Sunetra Pawar: పవార్ కుటుంబంలో ‘పవర్’ పాలిటిక్స్.. ఎన్సీపీ చీఫ్గా అజిత్ సతీమణి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunetra Pawar: విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన తరువాత, మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మారిన పరిస్థితుల కారణంగా ఇప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కొత్త అధ్యక్షుడి కోసం వెతుకుతోంది. NCP లో అజిత్ పవార్ శకం ముగిసిన తర్వాత పార్టీ గణనీయమైన మార్పులకు లోనవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని మహాయుతి సంకీర్ణ ప్రభుత్వంలో, అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ఆయన స్థానంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
READ ALSO: EPFO: ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మందికి షాక్..!
Also Read
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
కానీ పార్టీ స్థాయిలో ఇంకా మార్పులు చేయాల్సి ఉంది. ఎన్సీపీలో నాయకత్వ మార్పు ఆసన్నమైందని, సునేత్రా పవార్ పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్ను నియమించాలని చాలా మంది పార్టీ నాయకులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. నిజానికి అజిత్ పవార్ మరణం తరువాత, మహారాష్ట్ర రాజకీయాలు గణనీయమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పలు నివేదికల ప్రకారం.. ఇప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సునేత్రా పవార్ చేతుల్లో వెళ్తుందని సమాచారం. ఇప్పటివరకు పార్టీ పగ్గాలు అజిత్ పవార్ నిర్వహించేవారు. లోక్సభ ఎన్నికలు అయినా, జిల్లా స్థాయి ఎన్నికలు అయినా, టికెట్ల పంపిణీ నుంచి ప్రచార వ్యూహం వరకు ప్రతిదానికీ అజిత్ పవార్ బాధ్యత వహించారు. అయితే ఆయన ఆకస్మిక మరణం తరువాత, పార్టీలో అజిత్ పవార్ పేరు ప్రముఖంగా ఉండేలా చూసేందుకు పార్టీ నాయకులు ఈ బాధ్యతను సునేత్రా పవార్కు అప్పగించాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు పార్టీ త్వరలో జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటుకు ప్లాన్ చేస్తోంది.
సునేత్రా చుట్టూ NCP రాజకీయం..
రాబోయే కాలంలో NCP రాజకీయ శక్తి అంతా సునేత్రా పవార్ చుట్టూ కేంద్రీకృతమై ఉంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. పార్టీ నాయకత్వం నుంచి ప్రభుత్వ బాధ్యతల వరకు ప్రతి స్థాయిలో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని సమాచారం. అజిత్ పవార్ మరణం తరువాత ఎన్సీపీలో ఏర్పడిన నాయకత్వ శూన్యతను పూడ్చడానికి ఇప్పటికే జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతలోపార్టీలో నాయకత్వ మార్పు కోసం కూడా డిమాండ్లు పెరుగుతున్నాయి. సునేత్రా పవార్ను జాతీయ అధ్యక్షురాలిగా నియమించాలని అధికారికంగా డిమాండ్ చేస్తూ 30 ప్రధాన ఎన్సిపి సెల్ల అధ్యక్షులు, తాత్కాలిక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్కు ఒక లేఖను కూడా రాశారు. ఈ అంశంపై చర్చించడానికి త్వరలో NCP జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు కానుంది, ఈ సమావేశంలో పార్టీ నాయకత్వ మార్పుకు అధికారికంగా ఆమోదం లభించే అవకాశం ఉందని పలు వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే NCP చరిత్రలో ఇది ఒక ప్రధానమైన, నిర్ణయాత్మక మలుపుగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Gaddar Awards: ఉగాది పండుగ రోజు గద్దర్ అవార్డుల పంపిణీ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తాజావార్తలు
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
-
Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్లో కాలా చనా పులావ్.. టేస్ట్తో పాటు ప్రోటీన్ డబుల్.!
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!