Sunetra Pawar: పవార్ కుటుంబంలో ‘పవర్’ పాలిటిక్స్.. ఎన్సీపీ చీఫ్గా అజిత్ సతీమణి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunetra Pawar: విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన తరువాత, మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మారిన పరిస్థితుల కారణంగా ఇప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కొత్త అధ్యక్షుడి కోసం వెతుకుతోంది. NCP లో అజిత్ పవార్ శకం ముగిసిన తర్వాత పార్టీ గణనీయమైన మార్పులకు లోనవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని మహాయుతి సంకీర్ణ ప్రభుత్వంలో, అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ఆయన స్థానంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
READ ALSO: EPFO: ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మందికి షాక్..!
Also Read
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
- Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్కు భారీ ఎదురుదెబ్బ..
- Telangana Exhibitors : ఆ 'జీవో 77' రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ
కానీ పార్టీ స్థాయిలో ఇంకా మార్పులు చేయాల్సి ఉంది. ఎన్సీపీలో నాయకత్వ మార్పు ఆసన్నమైందని, సునేత్రా పవార్ పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్ను నియమించాలని చాలా మంది పార్టీ నాయకులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. నిజానికి అజిత్ పవార్ మరణం తరువాత, మహారాష్ట్ర రాజకీయాలు గణనీయమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పలు నివేదికల ప్రకారం.. ఇప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సునేత్రా పవార్ చేతుల్లో వెళ్తుందని సమాచారం. ఇప్పటివరకు పార్టీ పగ్గాలు అజిత్ పవార్ నిర్వహించేవారు. లోక్సభ ఎన్నికలు అయినా, జిల్లా స్థాయి ఎన్నికలు అయినా, టికెట్ల పంపిణీ నుంచి ప్రచార వ్యూహం వరకు ప్రతిదానికీ అజిత్ పవార్ బాధ్యత వహించారు. అయితే ఆయన ఆకస్మిక మరణం తరువాత, పార్టీలో అజిత్ పవార్ పేరు ప్రముఖంగా ఉండేలా చూసేందుకు పార్టీ నాయకులు ఈ బాధ్యతను సునేత్రా పవార్కు అప్పగించాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు పార్టీ త్వరలో జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటుకు ప్లాన్ చేస్తోంది.
సునేత్రా చుట్టూ NCP రాజకీయం..
రాబోయే కాలంలో NCP రాజకీయ శక్తి అంతా సునేత్రా పవార్ చుట్టూ కేంద్రీకృతమై ఉంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. పార్టీ నాయకత్వం నుంచి ప్రభుత్వ బాధ్యతల వరకు ప్రతి స్థాయిలో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని సమాచారం. అజిత్ పవార్ మరణం తరువాత ఎన్సీపీలో ఏర్పడిన నాయకత్వ శూన్యతను పూడ్చడానికి ఇప్పటికే జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతలోపార్టీలో నాయకత్వ మార్పు కోసం కూడా డిమాండ్లు పెరుగుతున్నాయి. సునేత్రా పవార్ను జాతీయ అధ్యక్షురాలిగా నియమించాలని అధికారికంగా డిమాండ్ చేస్తూ 30 ప్రధాన ఎన్సిపి సెల్ల అధ్యక్షులు, తాత్కాలిక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్కు ఒక లేఖను కూడా రాశారు. ఈ అంశంపై చర్చించడానికి త్వరలో NCP జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు కానుంది, ఈ సమావేశంలో పార్టీ నాయకత్వ మార్పుకు అధికారికంగా ఆమోదం లభించే అవకాశం ఉందని పలు వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే NCP చరిత్రలో ఇది ఒక ప్రధానమైన, నిర్ణయాత్మక మలుపుగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Gaddar Awards: ఉగాది పండుగ రోజు గద్దర్ అవార్డుల పంపిణీ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తాజావార్తలు
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
-
Telangana Congress : కాంగ్రెస్లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
-
Jagame Sangeetham : “శ్రుతి తప్పితే ఊరుకోను.. గతి తప్పావ్”.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ‘జగమే సంగీతం’ ట్రైలర్!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!