Sunetra Pawar: పవార్ కుటుంబంలో ‘పవర్’ పాలిటిక్స్.. ఎన్సీపీ చీఫ్గా అజిత్ సతీమణి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunetra Pawar: విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన తరువాత, మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మారిన పరిస్థితుల కారణంగా ఇప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కొత్త అధ్యక్షుడి కోసం వెతుకుతోంది. NCP లో అజిత్ పవార్ శకం ముగిసిన తర్వాత పార్టీ గణనీయమైన మార్పులకు లోనవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని మహాయుతి సంకీర్ణ ప్రభుత్వంలో, అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ఆయన స్థానంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
READ ALSO: EPFO: ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మందికి షాక్..!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
కానీ పార్టీ స్థాయిలో ఇంకా మార్పులు చేయాల్సి ఉంది. ఎన్సీపీలో నాయకత్వ మార్పు ఆసన్నమైందని, సునేత్రా పవార్ పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్ను నియమించాలని చాలా మంది పార్టీ నాయకులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. నిజానికి అజిత్ పవార్ మరణం తరువాత, మహారాష్ట్ర రాజకీయాలు గణనీయమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పలు నివేదికల ప్రకారం.. ఇప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సునేత్రా పవార్ చేతుల్లో వెళ్తుందని సమాచారం. ఇప్పటివరకు పార్టీ పగ్గాలు అజిత్ పవార్ నిర్వహించేవారు. లోక్సభ ఎన్నికలు అయినా, జిల్లా స్థాయి ఎన్నికలు అయినా, టికెట్ల పంపిణీ నుంచి ప్రచార వ్యూహం వరకు ప్రతిదానికీ అజిత్ పవార్ బాధ్యత వహించారు. అయితే ఆయన ఆకస్మిక మరణం తరువాత, పార్టీలో అజిత్ పవార్ పేరు ప్రముఖంగా ఉండేలా చూసేందుకు పార్టీ నాయకులు ఈ బాధ్యతను సునేత్రా పవార్కు అప్పగించాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు పార్టీ త్వరలో జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటుకు ప్లాన్ చేస్తోంది.
సునేత్రా చుట్టూ NCP రాజకీయం..
రాబోయే కాలంలో NCP రాజకీయ శక్తి అంతా సునేత్రా పవార్ చుట్టూ కేంద్రీకృతమై ఉంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. పార్టీ నాయకత్వం నుంచి ప్రభుత్వ బాధ్యతల వరకు ప్రతి స్థాయిలో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని సమాచారం. అజిత్ పవార్ మరణం తరువాత ఎన్సీపీలో ఏర్పడిన నాయకత్వ శూన్యతను పూడ్చడానికి ఇప్పటికే జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతలోపార్టీలో నాయకత్వ మార్పు కోసం కూడా డిమాండ్లు పెరుగుతున్నాయి. సునేత్రా పవార్ను జాతీయ అధ్యక్షురాలిగా నియమించాలని అధికారికంగా డిమాండ్ చేస్తూ 30 ప్రధాన ఎన్సిపి సెల్ల అధ్యక్షులు, తాత్కాలిక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్కు ఒక లేఖను కూడా రాశారు. ఈ అంశంపై చర్చించడానికి త్వరలో NCP జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు కానుంది, ఈ సమావేశంలో పార్టీ నాయకత్వ మార్పుకు అధికారికంగా ఆమోదం లభించే అవకాశం ఉందని పలు వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే NCP చరిత్రలో ఇది ఒక ప్రధానమైన, నిర్ణయాత్మక మలుపుగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Gaddar Awards: ఉగాది పండుగ రోజు గద్దర్ అవార్డుల పంపిణీ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!