Pawan Kalyan: అమిత్ షాతో పవన్ కీలక భేటీ.. తెలంగాణలో జనసేన సీట్లపై క్లారిటీ!
Pawan Kalyan: తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై బుధవారం స్పష్టత రానున్నట్లు బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కూడా చర్చల్లో పాల్గొననున్నట్లు సమాచారం. నేడు, రేపు(బుధవారం, గురువారం) రెండు రోజుల పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే ఉండనున్నారు. నేడు, రేపు బీజేపీ నేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ కానున్నారు. ప్రధాని మోడీతో కూడా భేటీ కావాలని పవన్ భావిస్తుండగా.. ఆ సమావేశం ఇంకా ఖరారు కాకపోవడం గమనార్హం. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ సహా పలు స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులపై స్పష్టత వస్తుందని పలువురు పేర్కొంటున్నారు.
Also Read: Kuruva Vijay Kumar: రేవంత్ రెడ్డి పై డీజీపీ అంజనీకుమార్ కు కురువ విజయ్ ఫిర్యాదు
Also Read
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
- Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అమిత్ షాతో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ భేటీ కానున్నారు. ఈ భేటీకి కిషన్ రెడ్డి , లక్ష్మణ్లు హాజరు కానున్నారు. తెలంగాణలో పొత్తు, సీట్ల పంపకాలపై అమిత్ షాతో చర్చలు జరపనున్నారు. తెలంగాణలో “జనసేన” పొత్తులపై బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకోనుంది. 12 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన ప్రతిపాదించింది. 6 నుంచి 8 స్థానాలను జనసేనకు ఇచ్చేందుకు బీజేపి రాష్ట్ర నాయకత్వం అంగీకరించింది. బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించి జనసేన అంతిమ నిర్ణయం తీసుకోనుంది. జనసేన నేతలు 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని బీజేపీ నేతలు వ్యక్తపరిచారు. ఈ విషయంపై కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు ఇటీవల పవన్ను కలిసి ఉమ్మడిగా పోటీ చేసే అంశంపై చర్చించారు. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు అంశం తెరమీదకు వచ్చిన విషయం విదితమే.
తాజావార్తలు
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!