Pawan Kalyan: ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుంటా.. ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఎమ్మెల్యేగా నేను సంపూర్ణ జీతమే తీసుకుంటాను అని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను ప్రజల సొమ్మును తింటున్నాననే బాధ్యతను అనుక్షణం గుర్తుంచుకోవాలనే జీతం తీసుకుంటున్నాను అన్నారు. నేను సరిగా పని చేయకుంటే.. ప్రతి రూపాయికి నన్ను చొక్కా పట్టుకుని నిలదీసే హక్కు ప్రజలకు ఉండాలి.. అందుకే జీతం తీసుకుంటున్నాను.. తర్వాత నేను తిరిగి ఇచ్చేది ఇచ్చేస్తాను.. వేయింతలు ఇచ్చేస్తాను.. అది వేరే విషయం అన్నారు పవన్..
ఇక, చట్టాలను చేసేవాళ్లు ఎలా ఉండాలో చూపిద్దాం.. పార్లమెంటుకు వెళ్లేది పరిచయాల కోసం.. ప్రజల కోసం పని చేయడానికి అని గుర్తుంచుకోవాలని సూచించారు పవన్.. పోటీ చేయని నేతలు కూడా అసెంబ్లీకి వెళ్తున్నట్టే. రక్తం ధారపోసిన జనసైనికులు.. గడప దాటని వీర మహిళలు పార్టీని గెలిపించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండేటువంటి విజయం సాధించాం. ఇల్లు అలకగానే పండుగ కాదు.. పండుగ చేసుకునే సమయం కాదన్నారు. ఇది బాధ్యతతో ఉండాల్సిన సమయం. విజయంతో వచ్చే అతిశయం నాకు లేదు.. పార్టీలో ఎవ్వరూ పెట్టుకోవద్దు అని హెచ్చరించారు. కేంద్రంలో కీలక భాగం కాబోతున్నాం.. ఎంపీలు ఉదయ్, బాలశౌరీకి చాలా బాధ్యత ఉంది. ఢిల్లీలో జనసేన ఎంపీల కదలిక.. కామెంట్లను ప్రతి ఒక్కరూ పరిశీలిస్తారు. ఏపీ ప్రజల తరపున లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు పవన్ కల్యాణ్..
Also Read
- Chandrababu: ప్రపంచానికే డేటా హబ్గా విశాఖ తయారవుతోంది
- Vaibhav Sooryavanshi: క్రిస్ గేల్ రికార్డు నాకు లెక్క కాదు.. టీ20ల్లో 200 కొట్టి చూపిస్తా: వైభవ్ సూర్యవంశీ
- Stock Market: లాభాల పంట పండించిన స్టాక్ మార్కెట్.. రేపటి వ్యూహం ఇలా..
- Fee Refund: నీట్ యూజీ పరీక్ష ఫీజు రిఫండ్.. దరఖాస్తుకు రెండు రోజులే సమయం..
ఇది అద్భుతమైన విజయం.. పోటీ చేసిన స్థానాలన్నింటినీ గెలుచుకోవడమనేది దాదాపు అసాధ్యం అన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.. ఈసారి ఎన్నికలను నడిపింది.. పవన్ తర్వాత సామాన్య జనసైనికులే అన్నారు.. మరోవైపు.. 100 శాతం స్ట్రైక్ రేట్ ఉండాలని పవన్ అన్నారు.. అదే జరిగిందన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. పోటీ చేసిన ప్రతి సీటు గెలవాలన్న పవన్ మాటల విలువేంటో ఇవాళ అందరికీ అర్థమైందన్నారు. ఇప్పుడు బాధ్యతగా ఎలా పని చేశామో.. అంతకు మించిన స్థాయిలో ఇక నుంచి కూడా పార్టీ కోసం పని చేయాలని సూచించారు నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
Sesha 2016: కిల్లర్ స్కెచ్తో వణికిపోయే పోలీసులు… రాత్రంతా నరకయాతన.. ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న థ్రిల్లర్ మూవీ
-
Team India: జూన్లో టీమ్ ఇండియా బిజీ బిజీ.. టెస్టులు, టీ20లు, వన్డేలతో సహా ఆరు అంతర్జాతీయ మ్యాచ్లు!
-
Horror Movie on OTT: తరతరాలను వెంటాడే ఆ భయంకర దుష్టశక్తి… ఊహించని ట్విస్ట్ లతో మైండ్ బ్లాక్ చేస్తున్న హారర్ థ్రిల్లర్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Chandrababu: ప్రపంచానికే డేటా హబ్గా విశాఖ తయారవుతోంది
ట్రెండింగ్
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!