Pawan Kalyan: ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ అవసరం.. భక్తుల భావాలను గౌరవించాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఏపీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కీలక విషయాలను తాజాగా మాట్లాడారు. తిరుమల దేవస్థానం కేవలం యాత్ర స్థలం మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణమని పేర్కొన్నారు. తిరుమల యాత్ర అనేది “భక్తి దైవానుగ్రహాన్ని కలుసుకునే స్థలం” అని పవన్ అన్నారు. అలాగే “తిరుమల లడ్డూ కేవలం స్వీట్ కాదు.. అది భక్తుల విశ్వాసానికి ప్రతీక” అని అన్నారు. భక్తులు ఈ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులతో పంచుకోవడం దైవానుగ్రహంగా భావిస్తారని అన్నారు. ప్రతి సంవత్సరం సగటున 2.5 కోట్ల మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారని తెలిపారు.
Also Read
- Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
- Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
సనాతన సంప్రదాయాలు, ఆచారాలను ఎవరైనా హేళన చేస్తే, అది కేవలం భక్తుల మనోభావాలను దెబ్బతీయడం మాత్రమే కాకుండా.. దేవాలయంపై ఉన్న విశ్వాసాన్నే దెబ్బతీసినట్లేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సనాతన ధర్మం అనేది భక్తుల సమిష్టి భావజాలం, వాటిని తేలికగా తీసే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. సనాతన ధర్మం ప్రపంచంలోనే పురాతనమైన నాగరికతని.. ఇది కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ వస్తోందని అన్నారు. తిరుమల, వేంకటేశ్వరస్వామి, లడ్డూ ప్రసాదం ఇవన్నీ భక్తుల హృదయంలో నిలిచిపోయిన విశ్వాసపు బంధం అని పవన్ అన్నారు. అలాగే సెక్యులరిజం అంటే ఒకపక్క మాత్రమే కాదు.. రెండు వైపులా సమాన గౌరవం ఉండాలన్నారు. మత విశ్వాసాలకు రక్షణ, గౌరవం ఇవ్వడం రాజీపడే అంశం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇంకా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు పై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందన్నారు. ఇది ఏ ఒక్క వర్గం నిర్ణయం కాదని.. అన్ని వర్గాల, అన్ని భాగస్వాముల ఏకాభిప్రాయంతో ముందుకు రావాల్సిన విషయం అని పేర్కొన్నారు.
Delhi Car blast: ఢిల్లీ కార్ బ్లాస్ట్తో జైషే మహ్మద్కు సంబంధం.?
తాజావార్తలు
-
Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
-
Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!