Baba Ramdev: తప్పుడు ప్రకటనల కేసు.. సుప్రీంకోర్టులో బాబా రామ్ దేవ్ క్షమాపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baba Ramdev: యోగా గురువు బాబా రామ్దేవ్ మరోసారి బహిరంగ క్షమాపణలు చెప్పారు. పతంజలి ఆయుర్వేదానికి సంబంధించిన తప్పుదోవ పట్టించే ప్రకటనల గురించి.. మళ్లీ క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. అయితే, పతంజలి నుంచి క్షమాపణలు కోరడం ఇదే తొలిసారి కాదు. మంగళవారం కూడా ఇదే విధమైన క్షమాపణలు తెలిపారు. అయితే సుప్రీం కోర్టు దానిపై తన అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘షరతులు లేని బహిరంగ క్షమాపణ’ శీర్షికతో కొత్తగా ప్రచురించిన క్షమాపణలో, పతంజలి ఆయుర్వేదం ఇలా పేర్కొంది, ‘గౌరవనీయమైన అపెక్స్ కోర్టులో కొనసాగుతున్న కేసు (రిట్ పిటిషన్ 645/2022) దృష్ట్యా, మేము వారి సూచనలు/ఆదేశాలకు అనుగుణంగా ఉన్నాము. గౌరవనీయులైన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకు మేము మా అవిధేయత లేదా పాటించనందుకు వ్యక్తిగతంగా మరియు కంపెనీ తరపున బహిరంగంగా క్షమాపణలు కోరుతున్నామని పేర్కొన్నారు.
Read Also:Varalaxmi: క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్న రిపోర్టర్… వరలక్ష్మీ షాకింగ్ రిప్లై
Also Read
- Satya Kumar Yadav: 'ఎబోలా'పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
- Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
- RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
’22 నవంబర్ 2023న విలేకరుల సమావేశం/మీటింగ్కు మేము బేషరతుగా క్షమాపణలు కోరుతున్నాము. ప్రకటనలను ప్రచురించడంలో జరిగిన పొరపాటుకు క్షమాపణలు కోరుతున్నాము. అలాంటి పొరపాట్లు మళ్లీ జరగవని హామీ ఇస్తున్నాము. గౌరవ న్యాయస్థానం ఆదేశాలను శ్రద్ధగా పాటించాలని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము కోర్టు గౌరవాన్ని కాపాడుతామని.. గౌరవ కోర్టు/అధికార సూచనలను, చట్టాలను అనుసరిస్తామని హామీ ఇస్తున్నామని తెలిపారు.
Read Also:Uttarpradesh : లక్నో మెడికల్ కాలేజీలో మహిళా సిబ్బంది ఆత్మహత్య
విశేషమేమిటంటే.. ఒకరోజు ముందు ప్రచురించిన ప్రకటనలో బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ పేర్లు లేకపోవడం.. విచారణ సందర్భంగా, క్షమాపణలు ప్రముఖంగా ప్రచురించారా అని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఎ అమానుల్లా ధర్మాసనం ప్రశ్నించింది. జస్టిస్ కోహ్లి, ‘క్షమాపణ ప్రముఖంగా ప్రచురించబడిందా? దాని ఫాంట్లు, పరిమాణాలు మీ పాత ప్రకటనల వలె ఉన్నాయా? అని వివరణ కోరింది. ప్రస్తుతం ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 30న జరగనుంది. అప్పుడు బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణలను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని కోరారు.
తాజావార్తలు
-
Satya Kumar Yadav: ‘ఎబోలా’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
-
Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
-
Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
-
West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
-
RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?