Rampachodavaram Agency; పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టిన పెద్దపులి రంపచోడవరం ఏజెన్సీలోకి ప్రవేశించడంతో రచ్చ ఏర్పడింది. ఫారెస్ట్ అధికారులు తమ గ్రామాలపైకి పెద్దపులిని విడిచిపెట్టారంటూ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలు రక్షించుకునేందుకు బాణాలు, విల్లులు, ఆయుధాలతో పులిపై ఎదురుదాడికి దిగుతామంటూ అధికారులను హెచ్చరిస్తున్నారు. ఈనెల 6న రాజమండ్రి వద్ద బంధించిన పెద్దపులికి ఎక్స్ ప్లోరర్ అనే పేరు పెట్టి 14న పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు. అయితే ఆ పెద్దపులి గత ఐదు రోజులుగా రంపచోడవరం ఏజెన్సీలోని బోలగొండ ఫారెస్ట్ లోని రంప, మర్రవాడ, పెద్ద గొండ గ్రామాలకు సమీపంలో సంచరిస్తూ గత రాత్రి ఒక ఆవు దూడలపై దాడి చేసింది. ప్రస్తుతం అడవిలోకి వెళ్లి జీడిపిక్కలు తెచ్చుకునే సమయం కావడంతో ఫల సాయం కోల్పోతున్నామని స్థానిక గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Suryakumar Yadav: ఆ వీడియోలు చూసి బరిలోకి దిగాం.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రంపచోడవరం నియోజకవర్గ ఆదివాసి భారత్ పార్టీ ఇంచార్జ్ అంజిరెడ్డి ఫారెస్ట్ ఫారెస్ట్ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. తమ గ్రామాలపైకి అధికారులు ప్రజాప్రతినిధులు పెద్దపులిని వదిలారని.. తమ వద్ద ఉన్న బాణాలతో దానిపై దాడి చేస్తామని హెచ్చరించారు.
అనేక సమస్యలతో ఉన్న ఆదివాసీలకు పులి సమస్యను తెచ్చి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఫారెస్ట్ రేంజ్ అధికారులు గ్రామానికి చేరుకుని రెండు రోజులపాటు గిరిజనులు అటవీ ప్రాంతంలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని.. పులి తన దారిన తాను వెళ్ళిపోతుందని చెబుతున్నారు. పశు సంవర్ధక శాఖ సిబ్బంది గాయపడిన ఆవు దూడలకు వైద్యం చేశారు.
READ MORE: Varanasi : ‘వారణాసి’ మేకింగ్ వీడియో.. రాజమౌళి విజన్కు ఫిదా అవుతున్న నెటిజన్లు!
