Panathala Suresh: చంద్రబాబుపై మండిపడ్డ బీజేపీ అసమ్మతి నేత.. ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ అసమ్మతి నేత పనతల సురేష్.. కడప ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు చేసిన కుట్రలో బీజేపీ పడిందన్నారు.. ఆ కుట్రలో భాగంగానే బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుందని.. ఈ పొత్తులో పలువురు బీజేపీ సీనియర్ నేతలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. విశాఖపట్నంలో చంద్రబాబు టీడీపీ, బీజేపీ నేతలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. ఎవరి నోట్లో మట్టి కొట్టడానికి బద్వేలులో రోశన్నకు టికెట్ కేటాయించారని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకను టీడీపీ అధినేత నొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
Read Also: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
కడప గడ్డపై విద్యార్థి సమస్యలపై ఉద్యమాలు చేశామని, ఆ ఉద్యమం సమయంలో అరెస్ట్ అయ్యి బేడీలతో పరీక్షలు రాసిన వ్యక్తి తానని తెలిపారు పనతల సురేష్.. బద్వేలు ఉప ఎన్నికల్లో నికార్సైన బీజేపీ కార్యకర్త అవసరం అని నన్ను ఎన్నికల్లో నిలిపారన్నారు. ఆ ఉప ఎన్నికల్లో నాకు 22 వేల ఓట్లు వచ్చాయని గుర్తుచేసుకున్నారు. అందుకోసమే ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి బద్వేలు టిక్కెట్ కేటాయించారని తెలిపారు. బద్వేలు బీజేపీ టిక్కెట్ రాత్రికి రాత్రి టీడీపీ కార్యకర్తకు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తు లో బీజేపీ సీనియర్ నేతలైన సోము వీర్రాజు, సుజనా చౌదరి, విష్ణు వర్ధన్ రాజులతో పాటు అనేక మందికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా బీజేపీ అధినాయకత్వం పునరాలోచించాలిని కోరారు. చంద్రబాబు నాయుడు పద్దతి మార్చు కోక పోతే, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి దళితులకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీకి ఓట్లు వేయద్దని ప్రచారం చేస్తానని హెచ్చరించారు బీజేపీ అసమ్మతి నేత పనతల సురేష్.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!