Panathala Suresh: చంద్రబాబుపై మండిపడ్డ బీజేపీ అసమ్మతి నేత.. ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ అసమ్మతి నేత పనతల సురేష్.. కడప ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు చేసిన కుట్రలో బీజేపీ పడిందన్నారు.. ఆ కుట్రలో భాగంగానే బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుందని.. ఈ పొత్తులో పలువురు బీజేపీ సీనియర్ నేతలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. విశాఖపట్నంలో చంద్రబాబు టీడీపీ, బీజేపీ నేతలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. ఎవరి నోట్లో మట్టి కొట్టడానికి బద్వేలులో రోశన్నకు టికెట్ కేటాయించారని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకను టీడీపీ అధినేత నొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
Read Also: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Trump: వచ్చే వారం ఇంకా దారుణంగా ఉంటుంది.. ఇరాన్పై కొత్త ప్రయోగానికి ట్రంప్ ప్రణాళిక!
- New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
- PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
కడప గడ్డపై విద్యార్థి సమస్యలపై ఉద్యమాలు చేశామని, ఆ ఉద్యమం సమయంలో అరెస్ట్ అయ్యి బేడీలతో పరీక్షలు రాసిన వ్యక్తి తానని తెలిపారు పనతల సురేష్.. బద్వేలు ఉప ఎన్నికల్లో నికార్సైన బీజేపీ కార్యకర్త అవసరం అని నన్ను ఎన్నికల్లో నిలిపారన్నారు. ఆ ఉప ఎన్నికల్లో నాకు 22 వేల ఓట్లు వచ్చాయని గుర్తుచేసుకున్నారు. అందుకోసమే ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి బద్వేలు టిక్కెట్ కేటాయించారని తెలిపారు. బద్వేలు బీజేపీ టిక్కెట్ రాత్రికి రాత్రి టీడీపీ కార్యకర్తకు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తు లో బీజేపీ సీనియర్ నేతలైన సోము వీర్రాజు, సుజనా చౌదరి, విష్ణు వర్ధన్ రాజులతో పాటు అనేక మందికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా బీజేపీ అధినాయకత్వం పునరాలోచించాలిని కోరారు. చంద్రబాబు నాయుడు పద్దతి మార్చు కోక పోతే, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి దళితులకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీకి ఓట్లు వేయద్దని ప్రచారం చేస్తానని హెచ్చరించారు బీజేపీ అసమ్మతి నేత పనతల సురేష్.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
-
Trump: వచ్చే వారం ఇంకా దారుణంగా ఉంటుంది.. ఇరాన్పై కొత్త ప్రయోగానికి ట్రంప్ ప్రణాళిక!
-
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!