PAN Card : పాన్ కార్డ్ హోల్డర్స్ జాగ్రత్త.. మే 31 వరకు ఈ పని చేయకుంటే చిక్కుల్లో పడతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAN Card : పాన్ కార్డ్ హోల్డర్లకు సంబంధించి ఒక పెద్ద వార్త బయటకు వచ్చింది. అందులో పాన్ వినియోగదారులు తమ ఖాతాను నిర్ణీత సమయానికి ముందే ఆధార్తో లింక్ చేయకపోతే, అప్పుడు చర్య తీసుకోబడుతుందని చెప్పబడింది. మే 31లోగా పన్ను చెల్లింపుదారులు తమ పాన్ను ఆధార్తో అనుసంధానిస్తే, టీడీఎస్ తగ్గింపుపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, బయోమెట్రిక్ ఆధార్తో పాన్ను లింక్ చేయకపోతే, వర్తించే రేటు కంటే రెట్టింపు టీడీఎస్ తగ్గించబడుతుంది. TDS/TCS ‘షార్ట్ డిడక్షన్/వసూళ్లు’లో డిఫాల్ట్ అయినట్లు పన్ను చెల్లింపుదారుల నుండి తమకు అనేక ఫిర్యాదులు అందాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBTD) తెలిపింది.
Read Also:CM YS Jagan: వైఎస్ వివేకా కేసు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
ఐటీ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ ఆధార్తో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) లింక్ అవ్వకపోతే సాధారణంగా వర్తించే రేటుకు రెండింతల టీడీఎస్ మినహాయింపులుంటాయి. కాగా, లావాదేవీ సమయంలో పాన్ ఇన్ఆపరేటివ్లో ఉన్న ట్యాక్స్పేయర్లకు టీడీఎస్/టీసీఎస్ షార్ట్ డిడక్షన్/కలెక్షన్ ఎగవేతకు పాల్పడ్డారన్న నోటీసులు వస్తున్నట్టు సీబీడీటీ తెలిపింది. ఈ మేరకు తమకు పన్ను చెల్లింపుదారుల నుంచి ఫిర్యాదులు అందాయని పేర్కొన్నది. అయితే అలాంటి కేసుల్లో మే 31కల్లా ఆధార్తో పాన్ అనుసంధానం కాకపోయినా సాధారణ రేటుకే టీడీఎస్/టీసీఎస్ వసూలుంటుందని సీబీడీటీ స్పష్టం చేసింది. కాగా, 2022 జూన్ 30 వరకు ఆధార్తో పాన్ అనుసంధానం ఉచితంగానే జరిగింది. జూలై 1 నుంచి 2023 జూన్ 30 వరకు రూ.1,000 ఆలస్య రుసుముతో అనుమతించారు. అప్పటికీ లింక్ అవ్వని పాన్ జూలై 1 నుంచి ఇన్ఆపరేటివ్లోకి వెళ్లింది. దీన్ని ఆపరేషన్లోకి తేవాలంటే రూ.1,000 ఫైన్ కట్టాల్సిందే
Read Also:Coolie : “కూలీ”కోసం రజనీ భారీ రెమ్యూనరేషన్..ఎన్ని కోట్లంటే..?
కానీ 30 రోజుల సమయం పడుతుంది. ఆధార్, పాన్ లింక్ కాకపోతే ఐటీ రిఫండ్ ఉండదు. లింక్ చేసుకుంటే రిఫండ్ వస్తుంది. కానీ, ఆలస్యానికి ఐటీ శాఖ నుంచి వడ్డీ రాదు
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!