ENG vs PAK: మూడో టెస్టులో ఇంగ్లండ్ పై పాకిస్థాన్ విజయం.. సిరీస్ కైవసం
- ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో పాకిస్థాన్ గెలుపు
- 9 వికెట్ల తేడాతో విజయం
- మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న పాక్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో.. షాన్ మసూద్ సారథ్యంలో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ టెస్ట్ సిరీస్లోని మొదటి మ్యాచ్లో ఇంగ్లండ్ గెలుపొందగా.. ఆ తర్వాత వరుసగా రెండు టెస్టు మ్యాచ్ల్లో పాకిస్థాన్ విజయం సాధించింది.
ఇంగ్లండ్తో జరిగిన మొదటి టెస్ట్ తర్వాత.. పాకిస్తాన్ జట్టులో భారీ మార్పులు చేసింది. ఈ క్రమంలో.. రెండు, మూడో టెస్టుల్లో జట్టులో చేరిన సాజిద్ ఖాన్, నోమన్ అలీ, కమ్రాన్ గులాం అద్భుతమైన ప్రదర్శన చేశారు. మూడో టెస్ట్ మ్యాచ్లో నోమన్, సాజిద్ ఇద్దరూ మంచి ప్రదర్శన కనబరిచారు. సాజిద్ మూడో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ టెస్ట్ సిరీస్లో పాకిస్థాన్ విజయానికి హీరోగా నిలిచాడు. దీంతో.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ టైటిల్ను గెలుచుకున్నాడు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
Read Also: Satish Kumar Reddy: చెల్లి కోసం జగన్ సొంత ఆస్తుల్లో కూడా వాటా ఇచ్చారు..
ఇంగ్లండ్పై నోమన్ అలీ 2 మ్యాచ్ల్లో 20 వికెట్లు తీయగా.. సాజిద్ ఖాన్ కూడా 2 మ్యాచ్ల్లో 19 వికెట్లు పడగొట్టాడు.. అంతేకాకుండా, జట్టు తరఫున పరుగులు కూడా చేశాడు. దీంతో అతను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్లో బాబర్ అజామ్ స్థానంలో వచ్చిన కమ్రాన్ గులామ్ కూడా ఆకట్టుకున్నాడు. రెండవ టెస్ట్లో జట్టుకు అద్భుత సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. షాన్ మసూద్ కెప్టెన్సీలో ఈ ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా మూడేళ్ల తర్వాత స్వదేశంలో టెస్ట్ సిరీస్ను గెలుచుకుంది.
ఈ టెస్టు సిరీస్లో పూర్తిగా స్పిన్నర్ల ప్రదర్శన కనపడింది. ఈ మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇరు జట్ల స్పిన్నర్లు కలిసి మొత్తం 73 వికెట్లు తీశారు. పాకిస్థాన్లో ఒకే టెస్టు సిరీస్లో స్పిన్నర్లు తీసిన అత్యధిక వికెట్లు ఇదే. గతంలో 1969-70లో పాకిస్థాన్-న్యూజిలాండ్ మ్యాచ్లో స్పిన్నర్లు మొత్తం 71 వికెట్లు పడగొట్టగా, ఈసారి స్పిన్నర్లు 73 వికెట్లు తీశారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..