ENG vs PAK: మూడో టెస్టులో ఇంగ్లండ్ పై పాకిస్థాన్ విజయం.. సిరీస్ కైవసం
- ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో పాకిస్థాన్ గెలుపు
- 9 వికెట్ల తేడాతో విజయం
- మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న పాక్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో.. షాన్ మసూద్ సారథ్యంలో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ టెస్ట్ సిరీస్లోని మొదటి మ్యాచ్లో ఇంగ్లండ్ గెలుపొందగా.. ఆ తర్వాత వరుసగా రెండు టెస్టు మ్యాచ్ల్లో పాకిస్థాన్ విజయం సాధించింది.
ఇంగ్లండ్తో జరిగిన మొదటి టెస్ట్ తర్వాత.. పాకిస్తాన్ జట్టులో భారీ మార్పులు చేసింది. ఈ క్రమంలో.. రెండు, మూడో టెస్టుల్లో జట్టులో చేరిన సాజిద్ ఖాన్, నోమన్ అలీ, కమ్రాన్ గులాం అద్భుతమైన ప్రదర్శన చేశారు. మూడో టెస్ట్ మ్యాచ్లో నోమన్, సాజిద్ ఇద్దరూ మంచి ప్రదర్శన కనబరిచారు. సాజిద్ మూడో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ టెస్ట్ సిరీస్లో పాకిస్థాన్ విజయానికి హీరోగా నిలిచాడు. దీంతో.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ టైటిల్ను గెలుచుకున్నాడు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
Read Also: Satish Kumar Reddy: చెల్లి కోసం జగన్ సొంత ఆస్తుల్లో కూడా వాటా ఇచ్చారు..
ఇంగ్లండ్పై నోమన్ అలీ 2 మ్యాచ్ల్లో 20 వికెట్లు తీయగా.. సాజిద్ ఖాన్ కూడా 2 మ్యాచ్ల్లో 19 వికెట్లు పడగొట్టాడు.. అంతేకాకుండా, జట్టు తరఫున పరుగులు కూడా చేశాడు. దీంతో అతను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్లో బాబర్ అజామ్ స్థానంలో వచ్చిన కమ్రాన్ గులామ్ కూడా ఆకట్టుకున్నాడు. రెండవ టెస్ట్లో జట్టుకు అద్భుత సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. షాన్ మసూద్ కెప్టెన్సీలో ఈ ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా మూడేళ్ల తర్వాత స్వదేశంలో టెస్ట్ సిరీస్ను గెలుచుకుంది.
ఈ టెస్టు సిరీస్లో పూర్తిగా స్పిన్నర్ల ప్రదర్శన కనపడింది. ఈ మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇరు జట్ల స్పిన్నర్లు కలిసి మొత్తం 73 వికెట్లు తీశారు. పాకిస్థాన్లో ఒకే టెస్టు సిరీస్లో స్పిన్నర్లు తీసిన అత్యధిక వికెట్లు ఇదే. గతంలో 1969-70లో పాకిస్థాన్-న్యూజిలాండ్ మ్యాచ్లో స్పిన్నర్లు మొత్తం 71 వికెట్లు పడగొట్టగా, ఈసారి స్పిన్నర్లు 73 వికెట్లు తీశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!