UP: పాకిస్థాన్ మహిళకు భారత్లో గవర్నమెంట్ జాబ్.. టీచర్గా ఉద్యోగం చేస్తూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: పాకిస్థాన్ మహిళకు భారత్లో ప్రభుత్వ ఉద్యోగం లభించింది.. పాకిస్థాన్ పౌరసత్వాన్ని దాచిపెట్టి విద్యాశాఖలో ఉద్యోగం పొందిన మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను ఉత్తర్ప్రదేశ్లోని అజీమ్నగర్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యాశాఖ చేపట్టిన అంతర్గత విచారణలో మహిరా అక్తర్ అనే మహిళ, ఫర్జానా అనే పేరుతో నకిలీ పత్రాలు ఉపయోగించి ఉద్యోగం పొందినట్లు తేలింది. ఆమె కుమహరియా గ్రామంలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
READ MORE: OPPO Reno 15 Price: 200MP కెమెరా, 6,500mAh బ్యాటరీ.. మతిపోయే ఫీచర్లతో ఒప్పో రెనో 15 లాంచ్!
Also Read
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
అదనపు ఎస్పీ అనురాగ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలు పాకిస్థాన్ పౌరురాలైనప్పటికీ తప్పుడు నివాస ధ్రువపత్రం చూపించి భారత పౌరురాలిగా నటిస్తూ ఉద్యోగం సాధించింది. ఈ నేపథ్యంలో మోసం, ఫోర్జరీ కేసుల కింద భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఆమెపై కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, ఆమె 1979లో ఒక పాకిస్థాన్ వ్యక్తిని వివాహం చేసుకుని పాకిస్థాన్ పౌరసత్వం పొందింది. ఆ తర్వాత విడాకులు తీసుకుని, పాకిస్థాన్ పాస్పోర్టుతో భారత్కు వచ్చి 1985 ప్రాంతంలో స్థానిక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అదే సమయంలో తాను భారత పౌరురాలినని చూపిస్తూ విద్యాశాఖలో ఉద్యోగంలో చేరింది. ఆమె అసలు పౌరసత్వం బయటపడటంతో విద్యాశాఖ ముందుగా సస్పెండ్ చేసి, అనంతరం ఉద్యోగం నుంచి తొలగించింది. శాఖ నివేదిక ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని అధికారులు తెలిపారు.
READ MORE: Amit Shah: జమ్మూకశ్మీర్పై అమిత్ షా అధ్యక్షతన భద్రతా సమావేశం.. నెక్ట్స్ టార్గెట్ ఇదే!
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?