Kyrgyzstan : కిర్గిజ్స్థాన్లో నలుగురు పాకిస్థానీ విద్యార్థుల దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kyrgyzstan : కిర్గిస్థాన్ రాజధాని బిష్కేశ్లో మెడిసిన్ చదవడానికి వెళ్లిన విద్యార్థులు కొత్త సమస్యలో కూరుకుపోయారు. ఇక్కడి స్థానిక ప్రజలు విదేశీ విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. అటువంటి హింసాత్మక గుంపు నగరం అంతటా అల్లర్లు సృష్టించింది. విదేశీ విద్యార్థులపై దాడి చేసింది. ఈ దాడిలో పాకిస్థానీ విద్యార్థులు అత్యధికంగా బాధితులు, గుంపు దాడి కారణంగా దాదాపు నలుగురు పాకిస్థానీ విద్యార్థులు మరణించారు. దీంతో అక్కడ చదువుకునేందుకు వెళ్లిన విదేశీ విద్యార్థులందరిలో భయాందోళన వాతావరణం నెలకొంది.
భారతదేశం, పాకిస్తాన్, ఇతర దేశాల నుండి వేలాది మంది విద్యార్థులు మెడిసిన్ చదవడానికి కిర్గిజ్స్థాన్కు వెళతారు. కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కేష్లో ఎక్కువ మంది విద్యార్థులు నివసిస్తున్నారు. అయితే ఇటీవల పరిస్థితులు దారుణంగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఈజిప్టు విద్యార్థులు అక్కడ దోపిడీ చేస్తున్న స్థానిక దొంగలతో పోరాడడంతో హింస చెలరేగిందని పాకిస్తానీ విద్యార్థులు తెలిపారు. ఆ తర్వాత అక్కడి స్థానికులు అంతర్జాతీయ విద్యార్థులను ఎంపిక చేసి చంపడం ప్రారంభించారు.
Also Read
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
Read Also:Prabhas : ప్రభాస్ చెప్పిన సర్ప్రైజింగ్ పర్సన్ ఎవరో తెలుసా..?
పాక్ ఎంబసీ నుంచి సహాయం కోసం విజ్ఞప్తి చేసినా అక్కడి నుంచి కూడా సహాయం అందలేదని విద్యార్థులు చెబుతున్నారు. పాకిస్థాన్లో ఉన్న ప్రజలకు ఆహారం అందించలేక, పాకిస్థాన్ నుంచి బయటకు వెళ్లిన వారిని రక్షించలేని విధంగా పాకిస్థాన్ నిస్సహాయంగా మారింది. మే 13న, వందలాది మంది గుంపు హాస్టల్లోకి ప్రవేశించి విద్యార్థులను బయటకు లాగడం ప్రారంభించినప్పుడు, చాలా మంది పాకిస్థానీ విద్యార్థులు రాయబార కార్యాలయానికి కాల్ చేసినప్పటికీ రాయబార కార్యాలయం ఎటువంటి సహాయం అందించలేదు. తర్వాత పాకిస్థానీ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లవద్దని, తమ హాస్టళ్లకే పరిమితం కావాలని సలహా జారీ చేశారు. పాకిస్తాన్లోని 10 వేల మంది విద్యార్థులు కిర్గిజ్స్థాన్లో చదువుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై పాక్ ఎంబసీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బిష్కేశ్లో ఉన్న పాకిస్థాన్ రాయబారి ముస్తాక్ అహ్మద్ విద్యార్థులతో మాట్లాడుతూ.. పరిస్థితి అకస్మాత్తుగా దిగజారింది. ఉన్నట్లుండి ఈ వ్యక్తులు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చారు. ధైర్యంగా ఉండండి, మేము పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాము. చాలా మంది పాకిస్తానీ విద్యార్థులు బిష్కేశ్లో ఇకపై సురక్షితంగా లేరు. రాయబార కార్యాలయం వారిని వీలైనంత త్వరగా దేశానికి పంపాలని చెప్పారు.
Read Also:S. Jaishankar: కిర్గిజిస్థాన్ లో విదేశీ విద్యార్థులపై దాడులు.. స్పందించిన భారత విదేశాంగ మంత్రి
తాజావార్తలు
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?