Pakistan Balochistan crisis: బలూచ్లో బలం చూపని పాక్.. ఉగ్రమూకల చేతిలో చావుదెబ్బ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Balochistan crisis: తాను పెంచిపోషించిన ఉగ్రమూకలపై పాకిస్థాన్ నియంత్రణ కోల్పోయింది. ఒకరకంగా వాటి చేతిలో ఓడిపోయిందని పలు నివేదికలు పేర్కొన్నాయి. పాకిస్థాన్ సైన్యం బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులపై నియంత్రణ కోల్పోతున్నాయని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు ప్రావిన్సులలోని అనేక ప్రాంతాలను BLA తిరుగుబాటు గ్రూపులు స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్థాన్ పార్లమెంటులో ఆ దేశ సెనేటర్ కమ్రాన్ ముర్తజా దీనిని అంగీకరించారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంటులో మాట్లాడుతూ.. బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో తిరుగుబాటుదారులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారని, దీనివల్ల భద్రతా దళాలు నిస్సహాయంగా ఉన్నాయని పేర్కొన్నారు. బలూచ్ నాయకులు, తిరుగుబాటుదారులు కమ్రాన్ ప్రసంగాన్ని తమ విజయంగా ప్రకటించుకున్నారు. అసలు పాక్ బలూచ్లో ఎందుకు బలం చూపలేకపోతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Mithun Reddy: వచ్చేది జగనన్న ప్రభుత్వమే.. దాని కోసం ఎన్ని కేసులైనా, ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటాం..!
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
పాక్ పార్లమెంట్లో ముర్తజా ఏం మాట్లాడారు..
పాక్ పార్లమెంటులో ముర్తజా మాట్లాడుతూ.. “పాకిస్థాన్ నిజంగా బలూచిస్థాన్ను పాలిస్తుందా?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో ఇటీవల పాకిస్థాన్ సైనిక నియంత్రణ ఐదు కిలోమీటర్లకు తగ్గించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో పాకిస్థాన్ మంత్రులు, ఎంపీలు రోడ్డు మార్గంలో ప్రయాణించలేరు.. ఎందుకంటే ఈ రోడ్లను తిరుగుబాటుదారులు ఆక్రమించుకున్నారు. జాతీయ అసెంబ్లీ, ప్రావిన్సులకు ఎన్నికైన ప్రజలు కూడా ఈ రోడ్లపై నడవలేకపోతే, ఇప్పటికైనా పాక్ ప్రభుత్వం, సైన్యం మేల్కొనాలని హితవు పలికారు.
పాక్ సైన్యానికి తిరుగుబాటుదారుల చేతిలో ఓటమి.. !
బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో తిరుగుబాటుదారులతో పాకిస్థాన్ సైన్యం పోరాడటం కొత్త కాదు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంపై పూర్తి నియంత్రణ సాధించడానికి పాక్ కష్టపడుతోంది. ఇటీవల ఈ ప్రాంతంలోని నాయకుల ప్రకటనల కారణంగా పాక్ సైన్యానికి మరిన్ని ఇబ్బందులు పెరిగాయని అంటున్నారు. ఇటీవల బలూచిస్థాన్లోని లక్కీ మార్వాట్ నాయకుడు షేర్ అఫ్జల్ మార్వాట్, తాలిబాన్లు ఈ ప్రాంతంలోని ఎక్కువ భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని స్పష్టంగా పేర్కొన్నారు. బలూచిస్థాన్ చాలా కాలంగా అస్థిరతను ఎదుర్కొంటోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA)తో సహా ఈ ప్రావిన్స్లోని అనేక తీవ్రవాద గ్రూపులు పాకిస్థాన్ సైన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు దిగాయి. ఈ తీవ్రవాద గ్రూపులు.. ఇక్కడి స్థానిక ప్రజలకు మరిన్ని హక్కులను డిమాండ్ చేస్తున్నాయి. ఈక్రమంలో పాక్ ఆర్మీ వారిని అణచివేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ఈ పోరులో వారిపై పెద్దగా విజయం సాధించలేకపోయింది.
READ ALSO: RSS Centenary Celebrations 2025: భారతమాత సేవకే ఆర్ఎస్ఎస్ అంకితమైంది: పీఎం మోడీ
తాజావార్తలు
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..