Pakistan : పాకిస్తాన్ లో పెరుగుతున్న కష్టాలు.. బతుకు జీవుడా అంటున్న జనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : పాకిస్థాన్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. రెండు పూటలా భోజనం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్థాన్లో ఆహారం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. పొరుగు దేశంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. వాటి ధరలు విపరీతంగా పెరిగి ప్రజల జీవనాన్ని కష్టతరం చేశాయి. పొరుగు దేశంలో వరుసగా రెండో వారం కూడా ద్రవ్యోల్బణం 40 శాతానికి పైగానే కొనసాగుతోంది. దీంతో సామాన్య ప్రజల వెన్ను విరిగింది. పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం నవంబర్ 23తో ముగిసిన వారంలో దేశ ద్రవ్యోల్బణం 41.13 శాతంగా నమోదైంది. పెరుగుతున్న గ్యాస్ ధరల కారణంగా ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని పాకిస్థాన్ వార్తాపత్రిక డాన్ పేర్కొంది. గత ఏడాది కాలంలో పాకిస్థాన్లో గ్యాస్ ధరలు రూ.1,100కు పైగా పెరిగాయి. పాకిస్థాన్లో పిండి ధర 88.2 శాతం భారీగా పెరిగింది. బాస్మతి బియ్యం 76.6 శాతం, సాదా బియ్యం 62.3 శాతం. టీ ఆకులు 53 శాతం, ఎర్ర కారం 81.70 శాతం, బెల్లం 50.8 శాతం, బంగాళదుంపలు 47.9 శాతం పెరిగాయి. సిగరెట్లు 94 శాతం, గోధుమ పిండి 88.2 శాతం, కారం పొడి 81.7 శాతం ఖరీదైంది.
Read Also:Hyderabad: ఎన్నికల వేళ ర్యాపిడో సంస్థ బంపర్ ఆఫర్.. ఆరోజు వారందరికీ ఫ్రీ రైడ్
Also Read
- Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
- ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
- AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
గతంలో రూ. 160 ఉన్న పిండి ధర ఇప్పుడు 88 శాతం పెరిగింది. అలాగే కిలో రూ.146 ఉన్న బియ్యం ధర 62 శాతం పెరిగింది. దీంతో ఇక్కడి ప్రజలకు తిండిలేక అవస్థలు పడుతున్నారు. గత వారంతో పోలిస్తే పాకిస్థాన్లో 25 నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. రోజువారీ ఉపయోగించే 13 వస్తువుల ధరలు తగ్గాయి. వారం వారీగా ధరలు పెరిగిన వస్తువులలో గ్యాస్ ధర 480 శాతం, టీ ప్యాకెట్ 8.9 శాతం, చికెన్ 4 శాతం, ఉప్పు పొడి 2.9 శాతం, గోధుమ పిండి 2.6 శాతం, బంగాళదుంప 2 శాతం చొప్పున పెరిగాయి. ఉల్లి ధర అత్యధికంగా 36 శాతం పడిపోయింది. గత వారంలో పాకిస్థాన్ స్వల్పకాలిక ద్రవ్యోల్బణం 10 శాతం పెరిగింది. 308.90తో పోలిస్తే 309.09 శాతానికి చేరుకుంది. పాకిస్తాన్లోని 17 ప్రధాన నగరాల్లోని 50 మార్కెట్ల నుండి 51 నిత్యావసర వస్తువుల ధరలను చేర్చడం ద్వారా ఈ గణాంకాలు తయారు చేయబడ్డాయి.
Read Also:Telangana Wines: తెలంగాణలో నేటి నుంచి వైన్స్ బంద్!
తాజావార్తలు
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
-
Varalaxmi Sarathkumar: హీరోయిన్ వరలక్ష్మికి ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్ బహిరంగ క్షమాపణ
-
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
-
AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!