Pak Social Media Accounts: పాక్ సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం ఎత్తివేత..? ప్రభుత్వం క్లారిటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం.. భారత్- పాకిస్థాన్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. దీంతో భారత్ దాయాది దేశంపై అనేక చర్యలు తీసుకుంది. పాకిస్థాన్ ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను నిషేధించింది. కానీ.. బుధవారం వారి ఖాతాలను అన్బ్లాక్ చేసినట్లు వార్తలు చెక్కర్లు కొట్టాయి. అనంతరం ఒక రోజు తర్వాత వాటిని మళ్ళీ బ్లాక్ చేశారు. గురువారం ఉదయం నుంచి పాకిస్థాన్కి చెందిన షాహిద్ అఫ్రిది, మావ్రా హోకేన్, యుమ్నా జైదీ, హనియా అమీర్, ఫవాద్ ఖాన్ వంటి ప్రముఖ తారల ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాలు బ్లాక్ అయ్యాయి.
READ MORE: Delhi Vehicle Policy : పాత వాహనాల నిషేధంపై ఢిల్లీ ప్రభుత్వం యూటర్న్..
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
వాస్తవానికి.. బుధవారం పాకిస్థాన్ స్టార్ల ఖాతాలు భారత్లో కొన్ని గంటల పాటు మళ్లీ కనిపించాయి. భారత ప్రభుత్వం పాకిస్థానీ సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం ఎత్తివేసిందని అభిప్రాయపడ్డారు. కానీ గురువారం ఉదయం నాటికి.. భారతీయ వినియోగదారులు ఇన్స్టాగ్రామ్లో పాక్ తారల ఖాతాలను ఓపెన్ చేయగా.. ‘ఈ ఖాతా భారతదేశంలో అందుబాటులో లేదు. ఎందుకంటే ఈ కంటెంట్ను నిషేధించాలనే చట్టపరమైన అభ్యర్థనను మేము పాటించాం’ అని రాసి ఉన్న సందేశం కనిపించింది. ఈ అంశంపై జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేకు ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. “సాంకేతిక లోపం కారణంగా ఖాతాలు ఓపెన్ అయ్యాయి. మీకు ఎక్స్, యూట్యూబ్, మెటాలో కొన్ని పాకిస్థాన్ సంబంధిత ఖాతాలు కనిపిస్తే అవి కొన్ని గంటల్లో మళ్లీ బ్లాక్ చేయబడతాయి. కొన్ని సాంకేతిక లోపం కారణంగా బుధవారం ఆయా ఖాతాలు అన్బ్లాక్ చేయబడ్డాయి. గురువారం నాటికి గుర్తించి సరి చేశాం” అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
READ MORE: Pakistan: ‘‘ ప్రతిస్పందించడానికి మాకు 30 సెకన్ల టైమ్ మాత్రమే ఉంది’’.. బ్రహ్మోస్ దాడిపై పాకిస్తాన్..
తాజావార్తలు
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!