Pakistan: మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ అధ్యక్షుడైనప్పటి నుంచి భారత్కు వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నారు. మాల్దీవుల్లో మోహరించిన భారత సైన్యాన్ని తిరిగి పంపే పనిని అధ్యక్షుడు మొయిజ్జూ స్టార్ట్ చేశారు. ఇందు కోసం ఒక ప్రతినిధి బృందం భారత్కు వచ్చి చర్చలు చేస్తుంది. మరోవైపు భారత్ను వ్యతిరేకిస్తున్న మాల్దీవులకు సాయం చేసేందుకు పాకిస్థాన్ ముందుకు వచ్చింది. పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాని అన్వరుల్ హక్ కకర్ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజుతో ఫోన్లో మాట్లాడి అభివృద్ధికి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Read Also: Karnataka: ఇద్దరు పిల్లలు.. కట్ చేస్తే హిజ్రాగా మారాడు! విషయం తెలిసి మూర్ఛపోయిన భార్య
ఇక, భారతదేశంతో ఉద్రిక్తత మధ్య పొరుగు దేశం పాకిస్తాన్ మాల్దీవులకు మద్దతుగా ముందుకు వచ్చింది. మాల్దీవుల అభివృద్ధి పనుల్లో సాయం చేస్తామని పాకిస్థాన్ హామీ ఇచ్చింది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజుతో టెలిఫోన్ సంభాషణ సందర్భంగా పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వరుల్ హక్ కాకర్ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. అలాగే, అభివృద్ధికి హామీ ఇచ్చారు.. ప్రాంతీయ సహకారంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో సహకారాన్ని పెంపొందించే మార్గాలపై కూడా ఇరువురు నేతలు చర్చించారు.
Read Also: Minister RK Roja: నగరి నుంచే పోటీ.. హ్యాట్రిక్ కొడతా..!
అయితే, మాల్దీవులు- పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు 26 జూలై 1966న ఏర్పాటయ్యాయి. రెండు దేశాల మధ్య మరో బలమైన బంధం చైనా.. ఒక రకంగా చెప్పాలంటే, పాకిస్తాన్ను చైనాకు ఎవర్గ్రీన్ ఫ్రెండ్గా పరిగణిస్తారు.. అయితే మాల్దీవుల అధ్యక్షుడు ముయిజు కూడా చైనాకు మద్దతుదారుడిగా ఉన్నారు. ఇక, రోజు రోజుకు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ క్షీణించి ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుంది.. అలాంటి పాకిస్తాన్- మాల్దీవులకు సహాయం చేస్తానంటూ హామీ ఇవ్వడం నిజంగా హస్యస్పదంగా ఉంది. ఇక, భారతీయ పర్యాటకులు మాల్దీవులను బహిష్కరించడంతో ఆ దేశ పర్యాటక రంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంది.