Assembly Election 2023: ముగ్గురు అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన ఒవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assembly Election 2023: ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ వెలుపల కూడా తమ పార్టీని విస్తరించడంలో నిమగ్నమయ్యారు. ఇందుకు ప్రయత్నాలు విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోనూ సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీ బరిలో నిలుస్తుందంటూ సూచనలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో తమకు బలం ఉందని భావిస్తున్న ప్రాంతాల్లో అభ్యర్థులను నిలుపుతూ కొన్నిచోట్ల విజయాలనే సొంతం చేసుకుంటుంది. తాజాగా అసదుద్దీన్ ఒవైసీ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. కర్ణాటకలో 100 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని అసదుద్దీన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Also: Viral Video: స్టంట్ అదిరింది.. కాకపోతే కారు అద్దం పగిలింది
Also Read
మరో రెండు, మూడు నెలల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడకపోయినప్పటికీ.. ప్రధాన రాజకీయా పార్టీలు కొంతకాలంగా జనం మధ్య ఉంటూ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కొనేందుకు సిద్దం అయ్యాయి. అభ్యర్థుల ఎంపికపై కూడా పార్టీలు దృష్టి సారించాయి. అయితే కర్ణాటక ఎన్నికల బరిలో నిలవాలనే నిర్ణయంతో ఉన్న అసదుద్దీన్ ఒవైసీ కూడా.. ముందుగానే తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. కర్ణాటకలోని మూడు అసెంబ్లీ స్థానాలలో ఎంఐఎం నుంచి బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
Read Also: Oxygen Plant Blast : ‘బంగ్లా’లోని ఆక్సీజన్ ప్లాంట్లో భారీ పేలుడు.. మృతులను లెక్కిస్తున్న రెస్క్యూ
త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాలో ముగ్గురి పేర్లను ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. బెలగావి నార్త్ నియోజకవర్గం నుండి లతీఫ్ ఖాన్ పఠాన్ , హుబ్లీ ధద్వాడ్ తూర్పు నుండి దుర్గప్ప బిజావాడ్ పోటీ చేయనున్నారు. రాబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు AIMIM అధ్యక్షుడు ప్రకటించిన మూడవ అభ్యర్థి బసవన భాగేవాడి నియోజకవర్గం నుండి అల్లాబక్ష్ బీజాపూర్ బరిలో నిలవనున్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!