8th Pay Commission: ఉద్యోగులకు ప్రభుత్వం షాక్… ఇప్పట్లో 8వ వేతన సంఘం లాంటివేం లేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
8th Pay Commission: 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందిస్తూ.. అలాంటి ప్రతిపాదనేమీ ప్రభుత్వం ముందు పరిశీలనలో లేదని చెప్పారు. 7వ వేతన సంఘంలోని పేరా 1.22ను పరిగణనలోకి తీసుకోకపోవడానికి, ఆమోదించకపోవడానికి ఫైళ్లలో ఎలాంటి కారణాలు నమోదయ్యాయని రాజ్యసభ సభ్యుడు రామ్నాథ్ ఠాకూర్ ఆర్థిక మంత్రిని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పందిస్తూ.. ఏడవ వేతన సంఘం ఆధారంగా వేతనాలు, అలవెన్సుల సవరణకు ఆమోదం తెలిపే సమయంలో కేంద్ర మంత్రివర్గం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదన్నారు.
Read Also:Health Tips : పరగడుపున తులసి నీళ్లను తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఏడవ వేతన సంఘం నివేదికలోని పేరా 1.22లో 5 సంవత్సరాల తర్వాత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను సమీక్షించాలని సిఫార్సు చేయబడింది. ఇది కేంద్ర ఉద్యోగుల జీతాల పెంపునకు మార్గం సుగమం చేస్తుంది. కానీ ప్రభుత్వం అమలు చేయకుండా తప్పించుకుంటోంది. పే కమీషన్ భారాన్ని ప్రభుత్వం భరించే స్థితిలో లేనందున ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయడం లేదా అని ఆర్థిక మంత్రిని కూడా అడిగారు. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్న ప్రభుత్వం గత 30 ఏళ్లుగా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న కేంద్ర ఉద్యోగుల జీతాలను సమీక్షించేందుకు ఎనిమిదో వేతన సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పందిస్తూ, ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని చెప్పారు.
Read Also:Gold Price Today : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే?
పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా, ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయాలని కేంద్ర ఉద్యోగులు నిరంతరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి 10 సంవత్సరాలకు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ పెంచడానికి ప్రభుత్వం కొత్త పే కమిషన్ను ఏర్పాటు చేస్తుంది. పే కమిషన్ తన నివేదిక మరియు సిఫార్సులను సమర్పించడానికి 18 నెలల సమయం ఉంది. 7వ వేతన సంఘం 2014లో ఏర్పాటైంది. దాని సిఫార్సులు జనవరి 1, 2016 నుండి అమలు చేయబడ్డాయి.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!