8th Pay Commission: ఉద్యోగులకు ప్రభుత్వం షాక్… ఇప్పట్లో 8వ వేతన సంఘం లాంటివేం లేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
8th Pay Commission: 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందిస్తూ.. అలాంటి ప్రతిపాదనేమీ ప్రభుత్వం ముందు పరిశీలనలో లేదని చెప్పారు. 7వ వేతన సంఘంలోని పేరా 1.22ను పరిగణనలోకి తీసుకోకపోవడానికి, ఆమోదించకపోవడానికి ఫైళ్లలో ఎలాంటి కారణాలు నమోదయ్యాయని రాజ్యసభ సభ్యుడు రామ్నాథ్ ఠాకూర్ ఆర్థిక మంత్రిని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పందిస్తూ.. ఏడవ వేతన సంఘం ఆధారంగా వేతనాలు, అలవెన్సుల సవరణకు ఆమోదం తెలిపే సమయంలో కేంద్ర మంత్రివర్గం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదన్నారు.
Read Also:Health Tips : పరగడుపున తులసి నీళ్లను తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Also Read
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
ఏడవ వేతన సంఘం నివేదికలోని పేరా 1.22లో 5 సంవత్సరాల తర్వాత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను సమీక్షించాలని సిఫార్సు చేయబడింది. ఇది కేంద్ర ఉద్యోగుల జీతాల పెంపునకు మార్గం సుగమం చేస్తుంది. కానీ ప్రభుత్వం అమలు చేయకుండా తప్పించుకుంటోంది. పే కమీషన్ భారాన్ని ప్రభుత్వం భరించే స్థితిలో లేనందున ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయడం లేదా అని ఆర్థిక మంత్రిని కూడా అడిగారు. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్న ప్రభుత్వం గత 30 ఏళ్లుగా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న కేంద్ర ఉద్యోగుల జీతాలను సమీక్షించేందుకు ఎనిమిదో వేతన సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పందిస్తూ, ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని చెప్పారు.
Read Also:Gold Price Today : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే?
పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా, ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయాలని కేంద్ర ఉద్యోగులు నిరంతరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి 10 సంవత్సరాలకు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ పెంచడానికి ప్రభుత్వం కొత్త పే కమిషన్ను ఏర్పాటు చేస్తుంది. పే కమిషన్ తన నివేదిక మరియు సిఫార్సులను సమర్పించడానికి 18 నెలల సమయం ఉంది. 7వ వేతన సంఘం 2014లో ఏర్పాటైంది. దాని సిఫార్సులు జనవరి 1, 2016 నుండి అమలు చేయబడ్డాయి.
తాజావార్తలు
-
Peddi vs Drishyam : మోహన్ లాల్కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
-
Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!