8th Pay Commission: ఉద్యోగులకు ప్రభుత్వం షాక్… ఇప్పట్లో 8వ వేతన సంఘం లాంటివేం లేవు
8th Pay Commission: 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందిస్తూ.. అలాంటి ప్రతిపాదనేమీ ప్రభుత్వం ముందు పరిశీలనలో లేదని చెప్పారు. 7వ వేతన సంఘంలోని పేరా 1.22ను పరిగణనలోకి తీసుకోకపోవడానికి, ఆమోదించకపోవడానికి ఫైళ్లలో ఎలాంటి కారణాలు నమోదయ్యాయని రాజ్యసభ సభ్యుడు రామ్నాథ్ ఠాకూర్ ఆర్థిక మంత్రిని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పందిస్తూ.. ఏడవ వేతన సంఘం ఆధారంగా వేతనాలు, అలవెన్సుల సవరణకు ఆమోదం తెలిపే సమయంలో కేంద్ర మంత్రివర్గం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదన్నారు.
Read Also:Health Tips : పరగడుపున తులసి నీళ్లను తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Also Read
- Dragon: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ..
- Trisha Karuppu: వయసు రివర్స్ అవుతోంది.. త్రిష బ్యూటీపై ఫ్యాన్స్ ఫిదా! కానీ మేకర్స్తో గొడవ ఏంటి?
- Peddi: చరణ్ ‘పెద్ది’ పంజా.. మహేష్ బాబు నిర్మిస్తున్న ‘రావు బహదూర్’కు థియేటర్ల సెగ!
- Devara 2: దేవర 2 నుండి.. నందమూరి ఫ్యాన్స్కు కొరటాల అదిరిపోయే ప్రామిస్!
ఏడవ వేతన సంఘం నివేదికలోని పేరా 1.22లో 5 సంవత్సరాల తర్వాత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను సమీక్షించాలని సిఫార్సు చేయబడింది. ఇది కేంద్ర ఉద్యోగుల జీతాల పెంపునకు మార్గం సుగమం చేస్తుంది. కానీ ప్రభుత్వం అమలు చేయకుండా తప్పించుకుంటోంది. పే కమీషన్ భారాన్ని ప్రభుత్వం భరించే స్థితిలో లేనందున ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయడం లేదా అని ఆర్థిక మంత్రిని కూడా అడిగారు. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్న ప్రభుత్వం గత 30 ఏళ్లుగా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న కేంద్ర ఉద్యోగుల జీతాలను సమీక్షించేందుకు ఎనిమిదో వేతన సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పందిస్తూ, ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని చెప్పారు.
Read Also:Gold Price Today : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే?
పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా, ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయాలని కేంద్ర ఉద్యోగులు నిరంతరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి 10 సంవత్సరాలకు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ పెంచడానికి ప్రభుత్వం కొత్త పే కమిషన్ను ఏర్పాటు చేస్తుంది. పే కమిషన్ తన నివేదిక మరియు సిఫార్సులను సమర్పించడానికి 18 నెలల సమయం ఉంది. 7వ వేతన సంఘం 2014లో ఏర్పాటైంది. దాని సిఫార్సులు జనవరి 1, 2016 నుండి అమలు చేయబడ్డాయి.
తాజావార్తలు
-
NTRNeel : డ్రాగన్ కోసం ఎన్టీఆర్ డబుల్ మేకోవర్.. ఫ్యాన్స్ కు పూనకాలే
-
Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ..
-
OTT Movies : ఈ వారం ఓటీటీ క్లాష్లో ఎవరు టాప్లో నిలుస్తారు?
-
Donald Trump: 14-సూత్రాల ప్లాన్తో ఇరాన్.. ఆమోదయోగ్యం కాదని ట్రంప్ తిరస్కరణ.. మళ్లీ యుద్ధం చెలరేగుతుందా?
-
Dubbing Movies : అర్థంకాని టైటిల్స్ పెట్టి నష్టపోతున్న నిర్మాతలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!