మెగాప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది..శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కింది.. ఈ సినిమా మార్చి 1 న విడుదలై మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. భారీ కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకుంది.. ఇక ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా, రుహానీ శర్మ, నవదీప్, శతాఫ్, సంపత్, పరేష్ పహుజా, అభినవ్ గోమఠం, అలీ రాజా, శ్వేతవర్మ తదితరులు నటించారు. రెనైసెన్స్ పిక్చర్స్, సోని పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమాను నిర్మించారు..
సైనికుల పై జరిగిన పుల్వామా దాడి, ఉగ్రవాదులకు ఇచ్చిన కౌంటర్ అటాక్ లాంటి యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపోందించారు. థియేటర్లలో విడుదలైన మొదటి షోతోనే పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగులో ఇలాంటి కథతో ఒక్క సినిమా కూడా రాలేదు.. మొదటిసారి వచ్చిన ఆపరేషన్ వాలంటైన్ భారీ విజయాన్ని అందుకుంది.. ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి అద్భుతంగా చూపించారు.. వాళ్లు చేస్తున్న సేవల గురించి ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపించారు..
ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ దక్కించుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేసింది .. మొదట ఏప్రిల్ మొదటి వారంలో అనుకున్నా కూడా ఇప్పుడు ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది.. మార్చి 29 న కొత్త సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. దాంతో ఈ సినిమాను వారం ముందుగానే ఓటీటీలో విడుదల చేశారు.. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది..