India vs Pak : పాక్ కాల్పులు.. ఇండియన్ ఆర్మీ జవాన్ మృతి
- పాక్ కాల్పుల్లో ఒక జవాన్ తో పాటు 15 మంది పౌరుల మృతి
- జవాన్ దినేష్ కుమార్ వీరమరణం
- భారత సైన్యం సంతాపం ప్రకటించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pak : ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత-పాకిస్తాన్ నియంత్రణ రేఖ (LoC) వద్ద పరిస్థితి తీవ్రంగా మారింది. పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడ్డ విషయం అధికారికంగా భారత సైన్యం ధృవీకరించింది. ఈ కాల్పుల్లో భారత జవాన్ దినేష్ కుమార్ వీరమరణం పొందారు. దినేష్ కుమార్ మృతిపై వైట్ నైట్ కార్ప్స్ సంతాపం తెలియజేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఇదే కాల్పుల్లో సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 43 మంది గాయపడ్డారు. వీరి కుటుంబాలకు కూడా భారత ఆర్మీ మానవీయ సహానుభూతిని ప్రకటించింది.
ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లో మెరుపుదాడులు చేపట్టింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడులు జీర్ణించుకోలేకపోయిన పాకిస్తాన్, భారతదేశంపై మరింత దాడులకు పూనుకుంది. పాక్ రేంజర్లు ఫూంచ్, తంగధర్ ప్రాంతాల్లో తీవ్ర కాల్పులకు దిగారు. అయితే ఈ దాడులకు భారత సైన్యం సమర్థంగా ప్రతిఘటించింది.
Also Read
YS Jagan: కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేం.. తప్పకుండా అధికారంలోకి వస్తాం!
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?