Mallikarjun Kharge: ట్రంప్ వాదనలను మోడీ ఎందుకు ఖండించడం లేదు..? ఖర్గే ప్రశ్న..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్ పై నేడు లోక్ సభలో చర్చ కొనసాగుతోంది. హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించారు. ఆపరేషన్ మహాదేవ్ లో పహల్గామ్ నిందితులను సైన్యం హతమార్చిందని అమిత్ షా స్పష్టం చేశారు. హతమైన ఉగ్రవాదులకు సంబంధించి ఆధారాలకు సభకు తెలిపారు. కాగా ఈ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్లమెంట్లో కొన్ని ప్రశ్నలు సంధించారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పహల్గామ్ సంఘటనను నిఘా వైఫల్యం అని స్పష్టం చేశారన్నారు. దానికి తాను బాధ్యత వహిస్తామని మనోజ్ సిన్హా అన్నట్టు తెలిపారు. వాస్తవానికి నిఘా హోంమంత్రి ఆధీనంలోకి వస్తుంది.. దీనికి హోంమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని తెలిపారు.. హోంమంత్రిని కాపాడటానికి లెఫ్టినెంట్ గవర్నర్ తాను బాధ్యత వహిస్తానని అన్నారా..? లేక హోంమంత్రి ఆయనతో ఇలా చెప్పించారా? అని ప్రశ్నించారు.
READ MORE: Ramchander Rao: కుర్చీ కాపాడుకునేందుకు సీఎం రేవంత్ కష్టపడుతున్నారు!
Also Read
- Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
- Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
- AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
- Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
“బీజేపీ ప్రభుత్వ హయాంలో పహల్గామ్లో ఐదుసార్లు దాడులు జరిగాయి. ఇంకా ఈ అంశంపై బీజేపీ గుణపాఠం నేర్చుకోలేదు. నిన్న ముగ్గురు ఉగ్రవాదులను చంపినట్లు ఇప్పుడే తెలిపారు. మిగిలిన వాళ్లను ఎప్పుడు కనుగొంటారో కూడా చెప్పండి. హోంమంత్రి కాంగ్రెస్పై మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్ అంశంపై మేము సీడబ్ల్యూసీ సమావేశంలో ఒక తీర్మానం ఆమోదించాం. సైన్యాన్ని గౌరవిస్తూ జై హింద్ యాత్ర చేపట్టాం. రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని నిర్ణయించుకుని.. ప్రభుత్వానికి సంఘీభావంగా నిలడ్డాం. కానీ మోడీ మాత్రం ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారు. ఇంకా చేస్తునే ఉన్నారు. పహల్గామ్కు ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్ ప్రారంభించారు. సైన్యం పాక్ పై బలంగా దాడి చేసింది. పాకిస్థాన్ లొంగిపోయింది. అకస్మాత్తుగా కాల్పుల విరమణ ప్రకటించారు. ఈ ప్రకటన ఎవరు, ఎక్కడి నుంచి చేశారు అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు మన ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి సమాధానం ఇవ్వలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్ నుంచి కాల్పుల విరమణ ప్రకటించారు. తాను యుద్ధాన్ని ఆపానని ట్రంప్ పేర్కొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం దానిని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. అధ్యక్షుడు ట్రంప్ తాను యుద్ధం ఆపానని 29 సార్లు తెలిపారు. ట్రంప్ భారతదేశానికి వ్యతిరేకంగా చేసిన ప్రకటనపై మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు. ఐదు జెట్ విమానాలను కూల్చివేసినట్లు మీ స్నేహితుడు ట్రంప్ అన్నారు. ఒక్క జెట్ కూడా నేల మట్టం కాలేదని మోడీ చెబితే దేశ ప్రజలు వినాలనుకుంటున్నారు.” అని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీలు, మంత్రులు సాయుధ దళాలను అవమానిస్తున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Ajith Kumar: అజిత్తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
-
Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
-
Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
-
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!