Indian Naval Power: పాక్ను గడగడలాడించిన మిగ్-29 విమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Naval Power: భారత దేశం తన అజేయమైన శక్తిసామర్థ్యాలను ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి చాటిచెప్పింది. భారత నావికాదళం క్రమంగా హిందూ మహాసముద్రంలో సూపర్ పవర్గా మారుతోంది. మే నెలలో పాకిస్థాన్పై ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఈ విషయాన్ని ప్రపంచానికి రుజువు చేసింది. ఇరుదేశాల మధ్య వివాదం ప్రారంభమైన తర్వాత, పాక్ నావికాదళాన్ని దాని స్వంత భూభాగంలోనే 15 మిగ్-29కె విమానాలతో చుట్టుముట్టినట్లు భారత వైస్ అడ్మిరల్ తాజాగా వెల్లడించారు.
READ ALSO: Prabhas : వార్-2ను దెబ్బ కొట్టిన కూలీ.. ప్రభాస్ రివేంజ్ తీరుస్తాడా..?
Also Read
మధ్యప్రదేశ్లోని డాక్టర్ అంబేద్కర్ నగర్లోని ఆర్మీ వార్ కాలేజీలో జరిగిన రణ్ సంవాద్-2025లో డిప్యూటీ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ (DCNS) వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇండియన్ నేవీ శక్తిసామర్థ్యాల గురించి, ఆపరేషన్ సింధూర్ సమయంలో నేవీ పని తీరు గురించి ఆయన వివరించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భారత నావికాదళం ప్రధాన యుద్ధనౌక TROPEX అప్పటికే ప్రారంభమైంది. దానితో పాటు అనేక యుద్ధనౌకలు పశ్చిమ తీరంలో మోహరించబడ్డాయని తెలిపారు. ఆపరేషనర్ సింధూర్ ప్రారంభమైన వెంటనే అన్ని యుద్ధ నౌకలను కేవలం 96 గంటల్లో సముద్రంలోకి మోహరించినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం ఆపరేషన్ను భారత స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధనౌక INS విక్రాంత్ నాయకత్వం వహిచింది. ఈ యుద్ధనౌకపై 15 MiG-29K యుద్ధ విమానాలు మోహరించబడ్డాయి. విక్రాంత్తో పాటు డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు, జలాంతర్గాములతో కూడిన టాస్క్ ఫోర్స్ హిందూ మహాసముద్రంలో మోహరించబడింది.
దీంతో పాకిస్థాన్ నావికాదళం కరాచీకి దక్షిణంగా ఉన్న అంతర్జాతీయ జలాల్లోని దాని ఓడరేవులకే పరిమితం అయ్యింది. భారత నావికాదళం ఇంత బలంగా మోహరించిన తర్వాత, పాకిస్థాన్ నావికాదళం సముద్రంలోకి ప్రవేశించడానికి ధైర్యం చేయలేకపోయిందన్నారు. భారత నావికాదళం ఎటువంటి ప్రత్యక్ష పోరాటం లేకుండా దానిపై పూర్తి ఒత్తిడిని తెచ్చిందని చెప్పారు. పాకిస్థాన్ నావికాదళం మన తీరప్రాంతాన్ని, వాణిజ్య మార్గాలను, సముద్ర ఆర్థిక మార్గాలను బెదిరించలేని విధంగా చూడటం తమ లక్ష్యమని వైస్ అడ్మిరల్ సోబ్టి అన్నారు.
‘నాన్-కాంటాక్ట్ వార్ఫేర్’
ఉపగ్రహాలు, డ్రోన్లు, తీరప్రాంత రాడార్లు, దీర్ఘ శ్రేణి క్షిపణుల సహాయంతో భారత నావికాదళం తన సరిహద్దుల్లోనే శత్రువులను ఆపగలదని ఆపరేషన్ సింధూర్ నిరూపించిందన్నారు. దీనిని నాన్-కాంటాక్ట్ వార్ఫేర్ అంటారని, ఇక్కడ సరిహద్దు దాటకుండానే వ్యూహాత్మక ప్రయోజనాన్ని సాధించవచ్చని చెప్పారు. ఈ ఆపరేషన్ నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకున్నామని చెప్పారు. ఎర్ర సముద్రం, అడెన్ గల్ఫ్లో హౌతీ తిరుగుబాటుదారులు వినియోగిస్తున్న తక్కువ ధర డ్రోన్లు పెద్ద ముప్పుగా మారుతున్నాయని అన్నారు. ఇలాంటి తక్కువ ఖర్చుతో నాశనం చేయగల వ్యవస్థలు నావికాదళానికి అవసరమని చెప్పారు.
READ ALSO: Radhakumari Success: ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలు.. చరిత్ర సృష్టించిన రాధాకుమారి..
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..