Students-Teacher: 106 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు విద్యాబోధన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
106 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు విద్యాబోధన చేస్తున్నారు. యూపీలోని జున్వాయి డెవలప్మెంట్ బ్లాక్ ప్రాంతంలోని చబుత్రా గ్రామంలో ఓ ప్రాథమిక పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు మాత్రమే.. ఒకటి నుండి ఐదవ తరగతి వరకు పిల్లలకు బోధిస్తున్నారు. అయితే.. ఆ పాఠశాలలో అంతమందికి ఒక్కరే ఉపాధ్యాయుడు ఉండటం అతనికి ఇబ్బందే.. ఇటు పిల్లలకు ఇబ్బందే. సరిగా విద్యను బోధించేవారు లేక పిల్లల చదువులకు ఆటంకం ఏర్పడుతోంది.
Magnetic reversal: భూమి “అయస్కాంత ధృవాలు” రివర్స్ అవుతున్నాయి.. ప్రళయం ముంచుకొస్తుందా..?
Also Read
- SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
- Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
- Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
ఈ విషయంలో అక్కడి విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం ‘గో టు స్కూల్’ అనే నినాదాన్ని ఇస్తూ పిల్లలకు చదువుపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. మరోవైపు పాఠశాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కొందరు అధికారులు ఏమీ పట్టించుకోవడం లేదు. జునావాయిలోని చబుత్రా గ్రామంలో ఉన్న పాఠశాల ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో టీచర్ దేవదత్ సింగ్ ఒక్కడే 106 మంది పిల్లలకు చదువు చెప్పే భారాన్ని మోస్తున్నారు. చాలా సంవత్సరాలుగా ఈ పాఠశాలలో మరెవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క టీచర్తోనే పాఠశాల నడుస్తోంది. ఒకటో తరగతిలో తొమ్మిది మంది, రెండో తరగతిలో 18 మంది, మూడో తరగతిలో 37 మంది, నాలుగో తరగతిలో 25 మంది, ఐదో తరగతిలో మొత్తం 16 మంది విద్యార్థులు ఉన్నారు.
AP Elections 2024: ఏపీలో కొనసాగుతోన్న టెన్షన్..! ఆ నియోజకవర్గాల్లో 144 సెక్షన్
ఈ పాఠశాలలో చాలా ఏళ్లుగా ఉపాధ్యాయుల కొరత ఉందని ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నానని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి వినోద్ మెహ్రా తెలిపారు. పిల్లల చదువులకు ఆటంకం కలగకుండా జూలై నెల నుంచి మరో ఇద్దరు ఉపాధ్యాయులను ఇక్కడ నియమించనున్నట్లు చెప్పారు. మరోవైపు.. సిబ్బందిని నియమించకపోవడంతో పిల్లలకు చదువులకు ఆటంకం ఏర్పడుతోందని పిల్లల తల్లిదండ్రలుు చెబుతున్నారు. పోస్టులో ఉన్న ఉపాధ్యాయుడు ఏదో ఒక సర్వే లేదా ఇతర ప్రభుత్వ పనుల కోసం ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే పాఠశాలకు తాళం పడుతుందని తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై ఏ అధికారి పట్టించుకోవడం లేదని.. ఇలాంటి పరిస్థితుల్లో తమ పిల్లల చదువులకు ఆటంకం కలుగుతోందని పేరెంట్స్ చెబుతున్నారు.
తాజావార్తలు
-
Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
-
SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
-
Ma Inti Bangaram: సమంత ఖాతాలో మరో ఘనత.. 100 కోట్ల దిశగా ‘మా ఇంటి బంగారం’
-
Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
-
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?