Site icon NTV Telugu

Jagannath Rath Yatra:రథ యాత్రలో తోపులాట..ఒకరి మృతి..వందల మందికి గాయాలు

Jagannath Rath Yatra (2)

Jagannath Rath Yatra (2)

ఒడిశా రాష్ట్రంలో ప్రసిద్ధ పూరి జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథయాత్ర ఉత్సవాలు దాదాపు పదిరోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసే రథయాత్రలో శ్రీకృష్ణుడిని జగన్నాథుడిగా ఆరాధిస్తారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శుక్ల పక్షం విధియ తిథి నుంచి ప్రారంభమవుతుంది. ఈ రథయాత్రలో పాల్గొనడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. కాగా ఈ యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. యాత్రలో తొక్కిసలాట జరిగి ఒకరు మరణించడం విచారకరం. దాదాపు 300 మంది భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

READ MORE: Fraud: ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో భారీ మోసం

పూరీ జగన్నథ రథయాత్ర ఆదివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ యాత్రకు దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో పూరీ నగరం “జై జగన్నాథ్” నినాదాలతో మార్మోగుతోంది. ఆదివారం సాయంత్రం జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర వారి రథాలు నందిఘోష, తాళధ్వజం, పధ్వధ్వజం రథాలపై తల్లి చెంతకు పయనమయ్యారు.

Exit mobile version