Off The Record : తెలంగాణలో కక్ష సాధింపు రాజకీయాలు ఉండవా? రేవంత్ వ్యూహం మార్చారా.. దూకుడు తగ్గించారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఇక మీదట కక్ష సాధింపు రాజకీయాలు ఉండవా? అసెంబ్లీ వేదికగా ఆ ప్రకటన చేసి సీఎం రేవంత్రెడ్డి ఓ ప్రత్యేక సందేశం పంపారా? అసలు సభ సాక్షిగా ఆ ప్రకటన చేయడాన్ని ఎలా చూడాలి? రేవంత్రెడ్డి దూకుడు తగ్గించుకున్నారా? లేక వ్యూహం మార్చారా? ఆయన మాటల వెనక శ్లేషలు దాగున్నాయా? ఆ విషయమై జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ పాలిటిక్స్లో ఇక కక్ష సాధింపు చర్యలు ఉండవంటూ… సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన కామెంట్స్ ఇప్పుడు గట్టి చర్చే మొదలైంది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. నిజంగానే రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగరా..? ఇన్నాళ్లు కేసులు పెట్టకుండా అందుకే ఉన్నారా..? పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటికంటే దూకుడు తగ్గించుకున్నారా..? లేదంటే… అసలు కాంగ్రెస్ అధిష్టానమే కళ్ళెం వేసిందా..? అంటూ రకరకాల ప్రశ్నలకు సమాధానాలు వెదుక్కునే పనిలో పనిలో ఉన్నాయి రాజకీయవర్గాలు. సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై… ఇంటా బయటా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే…. అసెంబ్లీలో కక్ష సాధింపు చర్యల గురించి కేటీఆర్ ప్రస్తావించగా… అసలు ఇప్పటి వరకు అలాంటి చర్యలకు దిగలేదని, కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ కట్టిస్తామని ఇచ్చిన హామీ ఇంకా నెరవేర్చలేదని అన్నారు సీఎం. సభలో ఆయన అలా కామెంట్స్ చేయడం వెనక వ్యూహం ఉందా..? అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబం పై ఎలాంటి చర్యలు లేకపోవడాన్ని కక్ష సాధింపులు లేకపోవడంలో భాగంగానే చూడాల్నా అన్న టాక్ నడుస్తోంది. ఐతే రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో… కేసీఆర్ కుటుంబంపై కేసులు ఊరికే పెట్టినవి కాదని అన్నారు. ఓ వైపు విచారణకి విద్యుత్ పై ఒక కమిషన్.. ఇరిగేషన్ పై మరో కమిషన్ వేశారు. ఇప్పటికే విద్యుత్ కొనుగోలుపై వేసిన కమిషన్ నివేదిక వచ్చింది. ఇక కాళేశ్వరం నివేదిక రావాల్సి ఉంది.
ఏదైనాసరే…చట్టానికి లోబడి చర్యలు ఉంటాయని రేవంత్ చెప్పారు కాబట్టి అందుకు అనుగుణంగా, ఆ ప్రకారమే ముందుకు వెళ్ళాలని భావిస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. కేసులు పెట్టడం ఈజీ గానీ… కోర్టుల్లో నిలబెట్టుకోవడం కష్టం. అందుకే జాగ్రత్తగా ముందడుగు వేయాలని రేవంత్ భావిస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. అసెంబ్లీలో రేవంత్ వ్యాఖ్యల్ని రెండు రకాలుగా చూస్తున్నారు పార్టీ నాయకులు. బీఆర్ఎస్ ముఖ్యుల్ని అరెస్ట్ చేసి కూడా సానుభూతి దొరక్కుండా చేయడం, వాళ్ళను భయంలోనే ఉంచి రాజకీయం చేయడం అన్న వ్యూహం కనిపిస్తోందని అంటున్నారు కొందరు. కేసీఆర్ తనను అక్రమంగా జైల్లో పెట్టినా… రేవంత్ కక్ష సాధింపు చర్యలకు పోకుండా పని చేస్తున్నారన్న క్రెడిట్ కొట్టేసే పనిలో రేవంత్ ఉన్నారన్నది ఇంకో వెర్షన్. కానీ పార్టీ క్యాడర్ని మాత్రం రేవంత్ వ్యాఖ్యలు నిరాశకు గురిచేశాయని చెప్పుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఓ వర్గం ప్రజలు కేసీఆర్ కుటుంబంపై కోపంతో కాంగ్రెస్ వెంట నడిచారు. కానీ ఇప్పుడు కేసులు ఉండవని చెప్పడంతో వాళ్లకు నిరాశగా ఉన్నట్టు ప్రచారం మొదలైంది. పదేళ్లు కేసీఆర్ హయాంలో కేసులు..జైళ్లు ఎదుర్కొన కాంగ్రెస్ క్యాడర్ కూడా రేవంత్ వ్యాఖ్యలతో డల్ అయ్యారన్న టాక్ మొదలైంది. కానీ… కాళేశ్వరం నివేదిక పై ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్నది చూశాకగానీ… రేవంత్ మాటల్ని అర్ధం చేసుకోలేమంటున్నారు పరిశీలకులు.
Also Read
- ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
- SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- 705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
తాజావార్తలు
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
-
Anna Lezhneva: జిమ్’లో వర్కౌట్స్ మొదలెట్టిన పవన్ భార్య
-
Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
-
Protein Rich Sattu Drink : ‘సత్తు డ్రింక్’ శరీరానికి పవర్ బూస్టర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా.!
ట్రెండింగ్
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..