Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Kaleshwaram Commission

Kaleshwaram Commission : కాళేశ్వరం కమిషన్‌ విచారణలో కొత్త ట్విస్టులు.. బీఆర్ఎస్ నేతలను తుమ్మల ఇరికించారా?

Published Date :June 13, 2025 , 8:39 pm
By Gogikar Sai Krishna
Kaleshwaram Commission : కాళేశ్వరం కమిషన్‌ విచారణలో కొత్త ట్విస్టులు.. బీఆర్ఎస్ నేతలను తుమ్మల ఇరికించారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

 

కాళేశ్వరం కమిషన్‌ విచారణలో సరికొత్త ట్విస్ట్‌లు ఉండబోతున్నాయా? బీఆర్‌ఎస్‌ ముఖ్యులు ఇంకా ఇరుక్కుంటున్నారా? ఆ మంత్రి…. మాజీ మంత్రుల్ని గట్టిగా ఇరికించేస్తున్నారా? కమిషన్‌కు ముగ్గురు ముఖ్యులు ఇచ్చిన వాంగ్మూలాల్లో వాస్తవం లేదంటూ…. తన దగ్గరున్న ఆధారాలను కమిషన్‌ ముందు పెట్టారా? ఎవరా మంత్రి? ఇప్పుడేం జరిగే అవకాశం ఉంది? తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్‌ విచారణే హాట్‌ టాపిక్‌. బ్యారేజీ పియర్స్ కుంగుబాటుపై కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ విచారణ చివరి దశకు చేరుకుంది. అయితే… ప్రాజెక్ట్‌ విషయంలో… అసలైన రాజకీయం ఇప్పుడే బయటపడుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈనెల ఆరున కమిషన్ ముందు విచారణకు హాజరైన మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్… అప్పటి క్యాబినెట్ నిర్ణయం మేరకే నిర్మాణం జరిగిందని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు ప్రాణహిత- చేవెళ్ల రీ డిజైన్, రీ ఇంజనీరింగ్ కోసం ముగ్గురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారని, నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు చైర్మన్ గా, తాను, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నామని స్పష్టం చేశారాయన. దీంతో అనూహ్యంగా ఈటల రాజేందర్….. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పేరును తెరమీదకు తీసుకు వచ్చినట్టయింది. దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట తుమ్మల. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ… కాళేశ్వరం నిర్మాణానికి క్యాబినెట్ అనుమతి లేదని, బీఆర్‌ఎస్‌ హయాంలో తాను మంత్రిగా ఉన్నన్ని రోజుల్లో ఎప్పుడూ క్యాబినెట్ మీటింగ్‌లో కాళేశ్వరం చర్చ జరగలేదని, తాను ఎలాంటి సంతకాలు పెట్టలేదని ప్రకటించడం సంచలనం అయింది. అక్కడితో ఊరుకోకుండా అంతకు మించిన సంచలనానికి తెరలేపారు తుమ్మల. కాళేశ్వరం కమిషన్‌కు మంత్రి లేఖ రాయడంతో ఈ వ్యవహారం ఎట్నుంచి ఎటు టర్న్‌ అవుతుందోన్న ఉత్కంఠ పెరుగుతోంది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు, అలాగే మంత్రివర్గ సమావేశాల మినిట్స్‌కి సంబంధించిన పత్రాలను కూడా ఆ లేఖకు జత చేశారట తుమ్మల. వాటన్నిటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోమని కోరడంతో…. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ పెద్దలు ఇరుక్కున్నట్టేనా అన్న చర్చ జోరుగా జరుగుతోంది తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో. కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్…., ప్రాజెక్ట్‌లో భాగమైన 3 బ్యారేజీల నిర్మాణాన్ని క్యాబినెట్ సబ్‌కమిటీ సూచనల మేరకే చేపట్టినట్టు తెలిపారు. కానీ…. ఈ వాదనను ఖండించారు తుమ్మల. అసలు ఉప సంఘం నివేదిక రావడానికి ముందే బ్యారేజీల నిర్మాణం ప్రారంభమైందన్నది మంత్రి వాదన. ఇదే విషయాన్ని అధికారిక పత్రాలతో సహా కమిషన్‌కు పంపారట ఆయన. దీంతో… కమిషన్‌ గనక ఆ లేఖను సీరియస్‌గా తీసుకుని లోతుల్లోకి వెళితే….. ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాలు, వాటి వెనుక ఉన్న అధికారిక ప్రక్రియలపై విచారణకు ఇది బలమైన ఆధారంగా మారవచ్చని భావిస్తున్నారు. జులైలో కమిషన్ తుది నివేదిక ఇవ్వాల్సి ఉన్న టైంలో..తుమ్మల రాసిన తాజా లేఖ ఆ నివేదిక రూపకల్పనలో కీలకమవుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో కమిషన్ గనుక లేఖ మీద స్పందిస్తే… మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కాళేశ్వరం కమిషన్‌ ముందు విచారణకు హాజరవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీనికి తోడు అవసరమైతే… కేసీఆర్‌, ఈటల రాజేందర్, హరీష్ రావును మళ్ళీ విచారణకు పిలిచే అవకాశాలు ఉండవచ్చంటున్నారు. ఇప్పుడు కమిషన్‌… తుమ్మల లేఖ లోతుల్లోకి వెళ్తుందా? లేక జరిపిన విచారణ చాలనుకుని తుది నివేదికను సిద్ధం చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kaleshwaram commission
  • NTV Telugu
  • OTR

తాజావార్తలు

  • Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టం తప్పదు!

  • Petrol, Diesel Prices: ఒక్కసారిగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మూడు రెట్లు పెంచుతూ సంచలన నిర్ణయం!

  • Unbroken IPL Records: 18 సీజన్ల తర్వాత కూడా చెక్కుచెదరకుండా.. ఐపీఎల్ తొలి సీజన్ రికార్డులు

  • Hyderabad: హైదరాబాద్‌లో బంకులు మూసివేత వెనుక అసలు కారణం ఇదే.. కొత్త రూల్స్‌తో జనాల్లో పానిక్!

  • Sanju Samson: 21 సార్లు ఫెయిలైనా 22వ సారి ఛాన్స్ ఇస్తా అన్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన సంజు!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions