Off The Record: అంతా తెలిసిపోయింది.. ఆ ఎమ్మెల్యేకు మిత్రపక్షం నేతలే పగోళ్లు!
- బొలిశెట్టి ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో వక్రీకరణలు
- తప్పులు వెదికే పనిలో జనసేన, టీడీపీ లోకల్ లీడర్స్
- వరుస వివాదాలతో జనసేన అధిష్టానం నుంచి ఎమ్మెల్యేకు వార్నింగ్
- ఎమ్మెల్యే కొంప ముంచుతున్న ముక్కుసూటితనం
- సొంత పార్టీ, మిత్రపక్షంలోని కొందరు డ్యామేజ్ చేస్తున్నారా?
- ఇక ఊరుకోబోనని సొంతోళ్ళకు కూడా ఎమ్మెల్యే వార్నింగ్
- టీడీపీ వాళ్ళని కూడా జనసేనలో చేర్చుకోవాలని నిర్ణయం
- తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన మధ్య తీవ్ర అగాధం?
- వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేస్తామంటున్న టీడీపీ లీడర్స్
- ఇక ఈ సీటు జనసేనదేనంటున్న బొలిశెట్టి శ్రీనివాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శత్రువులు ఎక్కడో ఉండరు.. మిత్రుల ముసుగులో మన చుట్టూనే తిరుగుతుంటారని తెగ ఫీలై పోతున్నారట ఆ ఎమ్మెల్యే. నమ్మకస్తుల్లా తన చుట్టూ తిరుగుతున్న వాళ్ళే.. ఎప్పటికప్పుడు ప్రత్యర్థులకు సమాచారం చేరవేస్తూ ముందరి కాళ్ళకు బంధాలు వేస్తున్నట్టు బాధపడుతున్నారట. నాకంతా తెలిసిపోయింది.. ఇక మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ అంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు?, ఆయన ఏం చేయబోతున్నారు?.
తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు కొందరు మిత్ర పక్షం నేతలే పక్కలో బల్లెంలా తయారయ్యారట. తాను ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఏదన్నా చేయాలని అనుకున్నా…. వాళ్ళు వెంటనే ఆ సమాచారాన్ని ప్రత్యర్థులకు చేరవేసి…. తన మాటలను వక్రీకరించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారంటూ మండిపడుతున్నారు ఎమ్మెల్యే. ఇటీవల ఏ కార్యక్రమం జరిగినా… చేతికి మైకు దొరికితే చాలు ఈ టాపిక్ తప్ప వేరే ఏమీ మాట్లాడ్డం లేదట బొలిశెట్టి. తన చుట్టూ చేరి .. నియోజకవర్గంలో చేస్తున్న పనుల్లో తప్పులు వెతికే పనిలో ఉన్న సొంత నేతలతో పాటు మిత్ర పార్టీ నాయకులకు కూడా ఎమ్మెల్యే మాస్ వార్నింగ్స్ ఇవ్వడం రాజకీయంగా కలకలం రేపుతోంది.ఇటీవల బొలిశెట్టి ఏం మాట్లాడినా అది వివాదంగా మారడం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం వల్ల జనసేన అధిష్టానం నుంచి కూడా ఆయనకు తిప్పలు తప్పడం లేదట..మాట్లాడే సమయంలో కాస్త సంయమనం పాటించాలని పార్టీ పెద్దల నుంచి ఆదేశాలు వస్తున్నాయట.
Also Read
- 10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ముక్కు సూటిగా వెళ్లే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారిందా అనే చర్చ ఆయన అనుచరవర్గంలో మొదలయ్యింది. కావాలని ప్రత్యర్థులు రెచ్చగొడుతుంటే…… వాళ్ళకు సమాధానం చెప్పే క్రమంలో ఎమ్మెల్యే ఇబ్బందుల్లో పడుతున్నారని, ఆయన ముక్కుసూటితనాన్ని కాస్త తప్పుగా అన్వయించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఇమేజ్ డ్యామేజ్ చేసే పనిలో ప్రత్యర్థులు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.దీంతో అసలు విషయం మరుగునపడి కొసరు విషయాల్లో MLA బొలిశెట్టి అలుసు అవుతున్నారన్న టాక్ నడుస్తోంది తాడేపల్లిగూడెంలో. ఆయన మాట్లాడిన మాటలు ముందు వెనుక కట్ చేసి వివాదంగా ఉండేలా ఎడిట్ చేసి మిత్ర పక్షాల నేతలు వైసీపీ వాళ్ళకు పంపుతున్నారట. ఈ విషయంలో టీడీపీ ఇన్ఛార్జ్, ఆయన అనుచరగణం ముందుందని బహిరంగంగానే అంటున్నారు బొలిశెట్టి. సొంత పార్టీ నేతలు కొందరు.. మిత్రపక్షం వాళ్ళు కొందరు కలిసి నా ఇమేజిని డ్యామేజి చేయాలని చూస్తే ఇకపై ఊరుకునేది లేదంటూనే గూడెంలో ఉండబోయేది జనసేన మాత్రమేనని ఎమ్మెల్యే అనడం మరింత కాక పెంచుతోంది. దీంతో కూటమి పార్టీలైన తెలుగుదేశం జనసేన మధ్య తాడేపల్లిగూడెంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది.
Also Read: Off The Record: బీఆర్ఎస్లో గుద్దులాటలు.. చిచ్చు రేపిన మండల అధ్యక్షుల ఎంపిక!
గతంలో టిడిపి ఇన్చార్జి వలవల బాబ్జి, ఎమ్మెల్యే బొలిశెట్టి మధ్య జరిగిన మాటల యుద్ధంపై పార్టీ అధిష్టానం సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలతో బొలిశెట్టి మాత్రం వెనక్కి తగ్గే ఆలోచనలో లేనట్టుగా కనిపిస్తోంది. గూడెంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలను వేగవంతం చేశారట ఎమ్మెల్యే. ఇందులో భాగంగా వైసిపి నుంచే కాకుండా…. టీడీపీ నుంచి వచ్చేవాళ్ళని కూడా జనసేనలో చేర్చుకోవాలని డిసైడైనట్టు సమాచారం. భవిష్యత్తులో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులు మారవచ్చు తప్ప సీటు మాత్రం ఎక్కడికీ పోదన్న భరోసాతో ఆ పార్టీ వైపు కొత్త నాయకులు అడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో ఇక్కడ అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ మధ్య దూరం మరింత పెరుగుతున్నట్టుగా కనిపిస్తోందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తాడేపల్లి గూడెం సీటు టీడీపీదేనని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడాన్ని కూడా ఇదే కోణంలో చూడాలన్నది పరిశీలకుల మాట. ఈ పరిణామాలతో… తన మిత్రులుగా ఉన్న వారిలో కొందరు రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిక్స్ అయ్యారట బొలిశెట్టి. అందుకే…. దేవుడు కరుణిస్తే, ఆరోగ్యం సహకరిస్తే మరోసారి ఎమ్మెల్యే అవుతాను. లేదంటే జనసేన తరఫున మరొకరు వస్తారంటూ… ఇక టీడీపీకి ఇక్కడ అవకాశం ఇవ్వబోమన్నట్టు మాట్లాడ్డం పొలిటికల్గా సెగలు పుట్టిస్తోంది. గూడెం కూటమిలో రాజుకున్న ఈ కుంపటి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!