Off The Record: మెదక్లో మళ్లీ పాత యుద్ధం.. పద్మాదేవేందర్రెడ్డి వర్సెస్ మైనంపల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మధ్య మరోసారి వార్ మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటి నుంచే వీరిద్దరి మధ్య రాజకీయ వైరం ఉంది. 2008లో జరిగిన ఉప ఎన్నిక, 2009 సాధారణ ఎన్నికల్లోనూ ఇద్దరూ తలపడగా మైనంపల్లి హనుమంతరావే పైచేయి సాధించారు. రాష్ట్రం విడిపోయాక మైనంపల్లి మెదక్ నియోజకవర్గం నుంచి మల్కాజిగిరికి షిఫ్ట్ అవడం, బీఆర్ఎస్లో చేరడంతో విభేదాలు సద్దుమణిగాయి. అయితే ఇప్పుడు కొడుకు రోహిత్ కోసం పార్టీ మారిన మైనంపల్లి కాంగ్రెస్లో చేరి మళ్లీ మెదక్ మీద దృష్టి పెట్టడంతో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మళ్లీ రాజకీయ యుద్ధం మొదలైనట్టయింది.
హనుమంతరావు తన కొడుకు రోహిత్కు మెదక్ నుంచి బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కుదరకపోవడంతో.. తనకిచ్చిన మల్కాజ్గిరి టిక్కెట్ని కూడా వదులుకుని అధికార పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరిపోయారాయన. పార్టీ మారాక మెదక్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారట మైనంపల్లి. అక్కడ వరుస పర్యటనలతో కేడర్కి దగ్గరవుతూ.. గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారట. మరో వైపు ఇన్నాళ్ళు తనకు అనుకూలంగా ఉన్న బీఆర్ఎస్ కేడర్ని కూడా తన వైపు తిప్పుకునే ప్లాన్లో ఉన్నట్టు తెలిసింది. దీంతో మెదక్ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి.
Also Read
- Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
తన పాత అనుచరులు, బీఆర్ఎస్ కేడర్ని మైనంపల్లి తిప్పుకోగలిగితే పద్మా దేవేందర్రెడ్డి తిప్పలేనంటున్నారు. ఈ క్రమంలోనే… పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఇప్పటి నుంచే మాటల తూటాలు పేలుస్తున్నారట నేతలిద్దరూ. ఇన్ని రోజులు అక్రమంగా సంపాదించిన డబ్బుల్ని నయా పైసాతో ఖర్చు పెట్టిస్తానని మైనంపల్లి చెబుతుంటే ఎలక్షన్లు రాగానే డబ్బుల సంచులతో బయలుదేరారంటూ రివర్స్ కౌంటర్ వేస్తున్నారు పద్మా దేవేందర్ రెడ్డి. ఈ పరిస్థితుల్లో ఈ సారి అందరి కన్ను మెదక్ పై పడినట్టు తెలిసింది. మరి మూడో సారి గెలిచి ఆమె హ్యాట్రిక్ కొడుతారా..? లేక మైనంపల్లి తన కుమారుడిని గెలిపించుకుని మెదక్లో పద్మకు ముచ్చటగా మూడో సారి ఓటమి రుచి చూపిస్తారా అన్నది ఆసక్తిగా మారింది.
తాజావార్తలు
-
Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
-
HMD Vibe 2 5G: 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో.. HMD వైబ్ 2 5G భారత్ లో విడుదల.. తక్కువ ధరకే
-
Shubman Gill: శుభ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
-
SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
-
Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!