Off The Record: రివర్స్ ఆలోచనల్లో ఎమ్మెల్యే కూసుకుంట్ల.. షాకవుతున్న బీఆర్ఎస్ కేడర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగినా….ఏక మొత్తంలో ఎగిరినా… మొత్తానికి టాప్ పొజిషన్లోకి వెళ్ళాలన్నది నాయకులందరి కల. కాలం కలిసి రాకున్నా, ఏటికి ఎదురీదాల్సి వచ్చినా… ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ ముందుకుపోతారు పొలిటికల్ లీడర్స్. కానీ… మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ ఆలోచన మాత్రం అందుకు రివర్స్లో ఉందట. ఆయన మాటలు విని సొంత కేడర్ సైతం ఈయనకేమైంది? ఇలా మాట్లాడుతున్నారని ముక్కున వేలేసుకుంటున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాను ఈసారి జడ్పీటీసీగా పోటీ చేస్తానని, అది కూడా ఎక్కడి నుంచైతే బాగుంటుందని సన్నిహితులను అడగడంతో నోళ్ళెల్లబెట్టడం వాళ్ళ వంతైందట. విషయం ఆనోటా, ఈనోటా పడి కేడర్కు చేరడంతో… వాళ్ళు కూడా ముందు షాకై… తర్వాత ఇదెక్కడి రివర్స్ టెండరింగ్… రా… బాబూ అని సెటైర్లు వేసుకుంటున్నారట.
సాధారణంగా ఎమ్మెల్యే అయిన వారు మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకుంటారు. కుదరదంటే.. కనీసం మరోసారి ఎమ్మెల్యేగానే పోటీ చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు. అదీ.. ఇదీ పోయి… ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి కానిస్టేబుల్ డ్యూటీ చేస్తానన్నట్టు… ఎమ్మెల్యే… జడ్పీటీసీగా పోటీ చేయడం గురించి ఆలోచించడమేంటి? మళ్ళీ దానికోసమో చర్చ జరపడమేంటీ? ఆసలీయనగారికి ఏమైందంటూ చెవులు కొరుక్కుంటున్నారట అనుచరులు. కానీ… ఎవడేమనుకుంటే.. మాకేంటి? మా లెక్కలు మాకున్నాయంటున్నారట కూసుకుంట్లకు అత్యంత సన్నిహితులు. జడ్పీటీసీగా పోటీ చేసి జిల్లా పరిషత్ ఛైర్మన్ అవుదామనుకుంటున్నారట ఆయన. అలా ఎందుకయ్యా… అంటే.. దానికీ ఓ లెక్కుందట. వామపక్షాలతో పొత్తు ఓకే అయితే ఈసారి మునుగోడు సీటును ఖచ్చితంగా వాళ్ళకే ఇస్తారన్నది ఎమ్మెల్యేకున్న సమాచారం అట. దానికి తోడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గ్రాఫ్ సరిగా లేదని అధిష్టానం దగ్గర కూడా రిపోర్ట్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నాడు ఉప ఎన్నికల సమయంలో ప్రయోగాలు చేయడం సరికాదన్న కోణంలో మాత్రమే మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కూసుకుంట్లకు టిక్కెట్ ఇచ్చారని, కానీ ఈసారి అది సాధ్యం కాకపోవచ్చన్న చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. దీంతో మునుగోడు నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు ఖాయమనే వాదన గట్టిగానే ఉంది. ఈ లెక్కలన్నీ వేసుకున్నాకే కూసుకుంట్ల జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి వైపు మొగ్గుతున్నారన్నది ఆయన సన్నిహితుల వాయిస్.
Also Read
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కూసుకుంట్ల ఇదే ప్రయత్నం చేసినా… అప్పుడు సాధ్యపడలేదు. అదే ప్రతిపాదనను తిరిగి తీసుకు రావడంతో ఎకసెక్కాలు కూడా ఎక్కువయ్యాయట. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలోని రెండు మండలాలు యాదాద్రి జిల్లాలో, నాలుగు మండలాలు నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నాయి. మరి ఆయన గారు ఏ జిల్లాకు జడ్పీ ఛైర్మన్ అవుదామనుకుంటున్నారో సెలవియ్యాలని వెటకారంగా మాట్లాడుకుంటున్నారట. మరోవైపు నియోజకవర్గ పరిధిలోని రెండు జిల్లాలకు చెందిన నలుగురు ఎంపీపీలపై అవిశ్వాసం పెట్టడం హాట్ టాపిక్ అయింది. ఎమ్మెల్యే తీరు వల్లే ఇదంతా అని చర్చ జరుగుతుండగా…. సొంత నేతలపై అవిశ్వాసాల నోటీసులు మంచి పరిణామం కాదని అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఆ తీర్మానాల వెనక ఎమ్మెల్యే ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 2018లో ఓటమి తర్వాత తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఉప ఎన్నికల సమయంలో సహకరించలేదన్న కారణంతో ఎమ్మెల్యే అవిశ్వాసాల పేరుతో స్థానిక నేతల్ని ఇబ్బందులు పెడుతున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. మొత్తం మీద ఈసారి మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి మార్పు తప్పదని తేలిపోయింది. పొత్తులో లెఫ్ట్కు ఇస్తారా లేక మరో గెలుపు గుర్రాన్ని రేసులోకి తెస్తారా అన్నది చూడాలి.
తాజావార్తలు
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
-
Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
-
Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..