Site icon NTV Telugu

England: దారుణం.. నవజాత శిశువులను చంపుతున్న నర్సు

Britan

Britan

బ్రిటన్‌లో ఓ నర్సు దారుణ ఘటనకు పాల్పడుతుంది. అప్పుడే పుట్టిన నవజాత శిశువులను చంపేస్తుంది. ఇంతకుముందు కూడా ఆ నర్సుపై పిల్లలను చంపుతున్న ఆరోపణలపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. 2016 ఫిబ్రవరిలో వాయువ్య ఇంగ్లండ్‌లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్‌లో నెలలు నిండని నవజాత శిశువును చంపడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా మరోసారి విషయం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. లూసీ లెట్బీ అనే నర్సు తాను పనిచేస్తున్న ఆసుపత్రిలో నవజాత శిశువును చంపడానికి ప్రయత్నించింది. దీంతో.. నర్సు లూసీ లెట్బీపై పిల్లలను చంపిన ఆరోపణలపై మళ్లీ కేసు నమోదైంది.

Bandi Sanjay : హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్

ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశం కావడంతో.. న్యాయవాది నిక్ జాన్సన్ తన కేసుపై దర్యాప్తు చేపట్టారు. నర్సు ఒక నవజాత శిశువుకు ఉన్న శ్వాస గొట్టాన్ని తొలగిస్తుండగా సీనియర్ కన్సల్టెంట్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారని ఆరోపించారు.
నర్సు పిల్లవాడిని ఊపిరి పీల్చుకోకుండా.. వెంటిలేటర్‌ కట్ చేసిందని, అంతేకాకుండా గుండె స్థాయిని నియంత్రించే మరో యంత్రాన్ని కట్ చేసిందని చెప్పారు. పిల్లల గుండె స్థాయి లేదా రక్తంలో ఆక్సిజన్ స్థాయి నిర్దిష్ట స్థాయి కంటే తక్కువగా ఉంటే.. అలారం మోగుతుందని.. అయితే అలారం మోగలేదని లాయర్ చెప్పారు.

Bihar: విరిగిన కాలుకు ప్లాస్టర్ బదులుగా అట్టపెట్టె.. ఇదేం వైద్యం రా.. బాబు

కొంత సమయం తర్వాత శిశువైద్యుడు రవి జయరామ్ వార్డుకు వెళ్లి చూడగా.. లెట్బీ అక్కడే ఉందని, అలారం మోగకుండా చేసిందని చెప్పారు. న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ.. నర్సు అక్కడ నిలబడి అలారం మోగకుండా అడ్డుకుంటోందని తెలిపారు. దీన్ని బట్టి లూసీ ఈ కేసులో దోషి అని మీరు ఊహించవచ్చన్నారు. మరోవైపు.. ఇంతకుముందు అదే ఆస్పత్రిలో 2015-2016 మధ్యకాలంలో ఏడుగురు శిశువులను హత్య చేసిందని.. ఆ కేసులో లూసీ లెట్బీ దోషిగా ఉందని లాయర్ తెలిపారు. పిల్లలను చంపేందుకు ఇన్సులిన్ ఇంజెక్ట్ చేయడం, నరాల్లోకి గాలి నింపడం, అధిక మోతాదులో పాలు ఇవ్వడం వంటి పద్ధతులను ఉపయోగించినట్లు తెలిపారు.

Exit mobile version