Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ntv Top News At 1pm On 7th January 2024

Top Headlines @ 1PM: టాప్‌ న్యూస్‌!

Published Date :January 7, 2024 , 1:10 pm
By Sampath Kumar
Top Headlines @ 1PM: టాప్‌ న్యూస్‌!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టమోటోకి, పొటాటోకి తేడా తెలియని సీఎం:
టమోటోకి, పొటాటోకి తేడా తెలియని సీఎం జగన్ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. సీఎం జగన్‌ రివర్స్‌ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు. దుర్మార్గుడు పాలిస్తే రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతిందని మండిపడ్డారు. అప్పుల్లో రాష్ట్ర రైతులు అగ్రస్థానంలో ఉన్నారని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ‘రా.. కదిలిరా’ అని పిలుపునిస్తున్నా అని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సభలో చంద్రబాబు మాటాడుతూ జగన్ పాలనను ఎండగట్టారు.

ఎమ్మెల్సీ రామచంద్రయ్య రాజీనామా:
వైసీపీ ఎమ్మెల్సీ పదవికి సీ రామచంద్రయ్య రాజీనామా చేశారు. అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే తాను రాజీనామా చేశానని రామచంద్రయ్య తెలిపారు. ఎమ్మెల్సీగా ఇంకా 3సంవత్సరాల పదవీకాలం ఉన్నా.. రాజీనామా చేస్తున్నా అని, ప్రజా జీవితంలో రాజీపడకుండా బ్రతుకున్నా అని అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని.. రాష్ట్రంలో ఏం జరుగుతుందో సీఎం వైఎస్ జగన్ చూసుకోవాలన్నారు. తప్పిదాలను జగన్‌కు చెప్పే అవకాశం రావడం లేదని, క్యాడర్ సలహాలు తీసుకోకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని రామచంద్రయ్య చెప్పారు.

Also Read

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
  • Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!

వైఎస్ఆర్ కలను నిజం చేయటానికే:
దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలను నిజం చేయటానికి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ అన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కొన్ని పార్టీల్లో భయం పట్టుకుందని విమర్శించారు. వైసీపీలో 2019కి ముందు రాజశేఖర్ రెడ్డి బొమ్మ ఎక్కడ ఉంది?, ఇప్పుడు ఎక్కడ పెట్టారు అని ప్రశ్నించారు. వైసీపీ మోసపూరిత వైఖరి నచ్చకనే షర్మిల ఆ పార్టీకి దూరమయ్యారని మస్తాన్ వలీ పేర్కొన్నారు.

నేటితో కాంగ్రెస్‌ పాలనకు నెల రోజులు:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నెలరోజులు పూర్తి చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో డిసెంబర్ 7న రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పాలన నేటితో ఒక నెల పూర్తయింది. ఈ నేపథ్యంలో రేవంత్ తన నెలరోజుల పాలనను గుర్తు చేస్తూ ప్రత్యేక ట్వీట్ చేశారు. ఈ 30 రోజుల పాలన తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని కాంగ్రెస్‌ నేటితో నెల రోజు పాలపై సీఎం రేవంత్ రెడ్డి ట్విటర్‌ వేదికగా స్పందించారు.

కేంద్రం నిధులు ఇస్తుందని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చిందా?
కేంద్రం నిధులు ఇస్తుందని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చిందా? అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవినీతిపైనే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడిందని మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ అంటే కాలయాపన చేసే యోచనగా కనిపిస్తుందన్నారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డీకే అరుణ అన్నారు. సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

వైభవంగా మల్లన్న కల్యాణం:
కొంగుబంగారం కొమురవెల్లి మల్లన్నస్వామి భక్తుల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా సాగుతోంది. ఉజ్జయిని అధ్యక్షులు సిద్ధలింగ రాజదేశికేంద్ర ఆధ్వర్యంలో బలిజ మేడలమ్మ, గొల్ల కేతంతో మల్లికార్జునుడి కల్యాణమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు.

షోలాపూర్‌లో రాళ్లదాడి:
మహారాష్ట్రలోని షోలాపూర్‌లో శనివారం హిందూ జనక్రోష్ మోర్చా నిర్వహిస్తున్న సందర్భంగా రాళ్లదాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి షోలాపూర్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలు నితీష్‌ రాణే, టీ రాజా సహా పదుల సంఖ్యలో వ్యక్తులపై కేసు నమోదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షోలాపూర్‌లో శనివారం సాయంత్రం సకల్ హిందూ సమాజ్ ఆధ్వర్యంలో హిందూ జన్ ఆక్రోశ్ మోర్చా నిర్వహించారు. ఎమ్మెల్యేలు నితీష్ రాణే, టి రాజా కూడా ఈ సమావేశానికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ మోర్చా కాలనీ గుండా వెళుతుండగా కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వి, ధ్వంసం చేసి, దుకాణాలకు నిప్పంటించారని చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే షోలాపూర్ పోలీసులు రంగంలోకి దిగి అతి కష్టం మీద శాంతిభద్రతలను కాపాడారు.

బిడ్డని కోల్పోయిన అవినాష్:
జబర్దస్త్ కామెడీ షోతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు అవినాష్. ముక్కు అవినాష్ గా బాగా పేరు తెచ్చుకున్న అతడు.. జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ హౌజ్ కి వెళ్లి అక్కడ కూడా ఆడియన్స్ ని బాగానే ఎంటర్టైన్ చేసాడు. జబర్దస్త్ నుంచి బయటకి వచ్చిన తర్వాత అవినాష్ స్టార్ మా ఛానెల్ కి షిఫ్ట్ అయిపోయాడు. 2021లో అనుజాని పెళ్లి చేసుకున్న అవినాష్… ఆడియన్స్ కి కూడా పరిచయం చేసాడు. ఈ జంట మెటర్నిటీ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో సందడి చేసాయి. మరో మూడు నెలల్లో అనుజా-అవినాష్ లైఫ్ లోకి కొత్త వ్యక్తి ఎంటర్ అవుతాడు అనుకుంటే.. ఊహించని విధంగా అనుజాకి మిస్ క్యారేజ్ అయ్యింది. 7వ నెలలో తల్లి గర్భంలోనే బిడ్డ చనిపోయింది అంటూ అవినాష్ తన అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నాడు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions