టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ‘దేవర’ మూవీ ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే. అంచనాలకు మించి ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకటుకుంది. ఇందులో తారక్ యాక్టింగ్ కూడా మునుపెన్నడూ లేని విధంగా చాలా పవర్ ఫుల్ గా చూపించారు. దీంతో ఇప్పుడు అందరి కళ్లు ‘దేవర పార్ట్ 2’ మీదే ఉన్నాయి. అయితే ఈ క్రేజీ సీక్వెల్ మీద చాలా వార్తలు వినిపిస్తున్న ప్పటికీ.. ఇప్పుడు ఏకంగా షూటింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది.
Also Read : Rashmika : బాలీవుడ్లో రష్మిక కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
తాజా సమాచారం ప్రకారం దర్శకుడు కొరటాల శివ ‘దేవర సీక్వెల్’ రెగ్యులర్ షూటింగ్ను నవంబర్ నుండి ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం సంగీతానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని సమాచారం. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునేలా కొరటాల శివ కథలో కీలక మార్పులు చేస్తూ కసరత్తులు చేస్తున్నారట. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. షూటింగ్ ఆరంభంలో ఎన్టీఆర్ అవసరం లేని సన్నివేశాలను ముందుగా చిత్రీకరించాలని భావిస్తున్నారట. జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.