Kim Jong Un: “5 వేల టన్నుల భారీ యుద్ధ నౌక”.. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల మధ్య ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన కిమ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kim Jong Un: ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో భీకర పోరాటం సాగుతోంది. ఇజ్రాయెల్-అమెరికా ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ ఉద్రిక్తతల్లో అనేక మంది ప్రజలు మరణించారు. కీలక అధినేతలు సైతం మృత్యుఒడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా నుంచి ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ తాజాగా నిర్మించిన భారీ యుద్ధ నౌకతో మరోసారి ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. వ్యూహాత్మక క్షిపణులను ప్రయోగిస్తూ తన నౌకాదళ శక్తిని ప్రపంచానికి చూపించాడు. అధికారిక సమాచారం ప్రకారం.. సుమారు ఐదు వేల టన్నుల బరువు కలిగిన కొత్త యుద్ధ నౌకను వినియోగంలోకి తీసుకొచ్చే ముందు ఈ ప్రయోగాలను నిర్వహించారు. నాంపో నౌకాశ్రయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని కిమ్ స్వయంగా పర్యవేక్షించడం హాట్ టాపిక్గా మారింది.
READ MORE: Nothing Phone (4a) Pro: 5080mAh బ్యాటరీ, Snapdragon 7 Gen 4తో.. Nothing Phone (4a) Pro రిలీజ్..
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ఈ యుద్ధ నౌకను పరీక్షించేందుకు ఇందులో నుంచి సముద్రం మీదున్న లక్ష్యాలపై దాడి చేసే క్షిపణులను ప్రయోగించారు. ఈ పరీక్షల ద్వారా కొత్త నౌక యుద్ధ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించామని ఉత్తర కొరియా ప్రభుత్వ మాధ్యమాలు వెల్లడించాయి. ఈ అంశంపై కిమ్ సైతం స్పందించారు. ఈ నౌక తమ దేశ సముద్ర రక్షణకు కొత్త ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. నీటి అడుగు నుంచే కాకుండా.. నీటి పైభాగం నుంచి కూడా దాడి చేసే శక్తి తమ నౌకాదళానికి ఉందని వెల్లడించారు. ముఖ్యంగా సముద్ర దళాన్ని అణు ఆయుధాలతో బలోపేతం చేసే ప్రక్రియ సంతృప్తికరంగా సాగుతోందని తెలిపారు. “ఈ విజయాలతో మా దేశ సముద్ర రక్షణ విధానంలో పెద్ద మార్పు వచ్చింది. దాదాపు యాభై సంవత్సరాలుగా సాధించలేని స్థాయిలో ఇప్పుడు సముద్ర సార్వభౌమత్వాన్ని రక్షించే శక్తి పెరిగింది. కొత్తగా నిర్మిస్తున్న యుద్ధ నౌకల శ్రేణిలో ఇది తొలి నౌకగా భావిస్తున్నాం.” అని వెల్లడించారు. ఈ నౌకను పరిశీలించేందుకు కిమ్ రెండు రోజుల పాటు నాంపో నౌకాశ్రయాన్ని సందర్శించారు. ఈ కొత్త ఆయుధం ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇదిలా ఉండగా.. అమెరికా, దక్షిణ కొరియా నుంచి వస్తున్న ఒత్తిడిని ఎదుర్కోవాలంటే శక్తివంతమైన నిరోధక శక్తి అవసరమని ఉత్తర కొరియా చాలా కాలంగా చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. అందుకే అణు ఆయుధాలు, క్షిపణులు, నౌకాదళ శక్తి అభివృద్ధికి ఆ దేశం నిరంతరం ప్రాధాన్యం ఇస్తోంది. తాజా క్షిపణి పరీక్షలతో ఉత్తర కొరియా సముద్ర రక్షణ వ్యవస్థలో కొత్త దశ ప్రారంభమైందనే సందేశాన్ని ప్రపంచానికి పంపించింది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!