Printing Fake Notes: మామూలోడు కాదు.. యూట్యూబ్లో చూసి నకిలీ నోట్లు ముద్రించాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Printing Fake Notes: యూట్యూబ్లో చూసి నేర్చుకుని ఓ వ్యక్తి నకిలీ నోట్లను ముద్రించాడు ఓ ప్రబుద్ధుడు. ఢిల్లీలోని తన నివాసంలో యూట్యూబ్లో పాఠాలు నేర్చుకున్న తర్వాత రూ.38,220 విలువైన నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించిన 30 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు నోయిడా పోలీసులు శుక్రవారం తెలిపారు. నిందితుడిని ఛప్రౌలా గ్రామ సమీపంలోని జీటీ రోడ్డులో బాదల్పూర్ పోలీసు స్టేషన్ అధికారులు పక్కా సమాచారంతో పట్టుకున్నారని అదనపు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ నోయిడా) రాజీవ్ దీక్షిత్ తెలిపారు.
ప్రింటర్ను ఉపయోగించి నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించిన వ్యక్తిని అరెస్టు చేయడంలో పోలీసు బృందం విజయం సాధించింది. నిందితుడిని అబ్దుల్ రకీబ్గా గుర్తించారు. అతను ప్రస్తుతం ఢిల్లీలోని ఘాజీపూర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతను బీహార్లోని ముజఫర్పూర్కు చెందినవాడని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలోని ఘాజీపూర్లో అబ్దుల్ రకీబ్, తన భాగస్వామి పంకజ్తో కలిసి నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించే పనిలో పడ్డారు. వారు ఉపయోగించిన ప్రింటర్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. 20, 50, 100, 200 డినామినేషన్లతో సహా రూ.38,220 విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ తెలిపారు. కేసుకు సంబంధించిన ఇతర వివరాలను ధృవీకరించడానికి తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. తప్పిపోయిన ఇతర అనుమానితుడు పంకజ్ను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని అదనపు డీసీపీ రాజీవ్ దీక్షిత్ చెప్పారు.
Also Read
- Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
- Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
- Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
- Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
Read Also: Maryam Nawaz Sharif: ఇమ్రాన్ఖాన్ పార్టీని తీవ్రవాద సంస్థగా పరిగణించాలి..
మరో పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు యూట్యూబ్ ద్వారా సాధారణ కంప్యూటర్ ప్రింటర్ను ఉపయోగించి నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించడం గురించి తెలుసుకున్నాడు. నిందితులు దాదాపు రెండు నెలల పాటు ఈ పనిలో నిమగ్నమై, నకిలీ నోట్లను ఉపయోగించి వారి వ్యక్తిగత అవసరాల కోసం వస్తువులను కొనుగోలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నించారు. కానీ ఢిల్లీలోని ప్రజలు వాటిని తిరస్కరించడం ప్రారంభించిన తర్వాత, వారు నోయిడా, గ్రేటర్ నోయిడాలో ఆ నోట్లను ఉపయోగించేందుకు ప్రయత్నించారని అధికారి తెలిపారు. వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రకీబ్ను స్థానిక కోర్టులో హాజరుపరచగా, అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు వారు తెలిపారు.
తాజావార్తలు
-
Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
-
Harish Rao : రేవంత్కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
-
Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
-
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
-
Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!