Printing Fake Notes: మామూలోడు కాదు.. యూట్యూబ్లో చూసి నకిలీ నోట్లు ముద్రించాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Printing Fake Notes: యూట్యూబ్లో చూసి నేర్చుకుని ఓ వ్యక్తి నకిలీ నోట్లను ముద్రించాడు ఓ ప్రబుద్ధుడు. ఢిల్లీలోని తన నివాసంలో యూట్యూబ్లో పాఠాలు నేర్చుకున్న తర్వాత రూ.38,220 విలువైన నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించిన 30 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు నోయిడా పోలీసులు శుక్రవారం తెలిపారు. నిందితుడిని ఛప్రౌలా గ్రామ సమీపంలోని జీటీ రోడ్డులో బాదల్పూర్ పోలీసు స్టేషన్ అధికారులు పక్కా సమాచారంతో పట్టుకున్నారని అదనపు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ నోయిడా) రాజీవ్ దీక్షిత్ తెలిపారు.
ప్రింటర్ను ఉపయోగించి నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించిన వ్యక్తిని అరెస్టు చేయడంలో పోలీసు బృందం విజయం సాధించింది. నిందితుడిని అబ్దుల్ రకీబ్గా గుర్తించారు. అతను ప్రస్తుతం ఢిల్లీలోని ఘాజీపూర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతను బీహార్లోని ముజఫర్పూర్కు చెందినవాడని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలోని ఘాజీపూర్లో అబ్దుల్ రకీబ్, తన భాగస్వామి పంకజ్తో కలిసి నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించే పనిలో పడ్డారు. వారు ఉపయోగించిన ప్రింటర్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. 20, 50, 100, 200 డినామినేషన్లతో సహా రూ.38,220 విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ తెలిపారు. కేసుకు సంబంధించిన ఇతర వివరాలను ధృవీకరించడానికి తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. తప్పిపోయిన ఇతర అనుమానితుడు పంకజ్ను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని అదనపు డీసీపీ రాజీవ్ దీక్షిత్ చెప్పారు.
Also Read
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
Read Also: Maryam Nawaz Sharif: ఇమ్రాన్ఖాన్ పార్టీని తీవ్రవాద సంస్థగా పరిగణించాలి..
మరో పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు యూట్యూబ్ ద్వారా సాధారణ కంప్యూటర్ ప్రింటర్ను ఉపయోగించి నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించడం గురించి తెలుసుకున్నాడు. నిందితులు దాదాపు రెండు నెలల పాటు ఈ పనిలో నిమగ్నమై, నకిలీ నోట్లను ఉపయోగించి వారి వ్యక్తిగత అవసరాల కోసం వస్తువులను కొనుగోలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నించారు. కానీ ఢిల్లీలోని ప్రజలు వాటిని తిరస్కరించడం ప్రారంభించిన తర్వాత, వారు నోయిడా, గ్రేటర్ నోయిడాలో ఆ నోట్లను ఉపయోగించేందుకు ప్రయత్నించారని అధికారి తెలిపారు. వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రకీబ్ను స్థానిక కోర్టులో హాజరుపరచగా, అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు వారు తెలిపారు.
తాజావార్తలు
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!