Nobel Prize History: రేపటి నుంచే నోబెల్ బహుమతుల ప్రదానం.. మొదటి సారి ఎప్పుడు ఇచ్చారో తెలుసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nobel Prize History: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతులు అక్టోబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రకటించనున్నారు. భౌతిక శాస్త్రం మొదలుకొని వివిధ విభాగాలలో ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఫిజియాలజీ లేదా మెడిసిన్ విభాగంలో విజేతలను ముందుగా ప్రకటిస్తారు. విజేతల పేర్లను వాలెన్బర్గ్సాలెన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లో నోబెల్ అసెంబ్లీ ప్రకటిస్తుంది. తర్వాత భౌతిక శాస్త్రం నుంచి విజేతలను స్టాక్హోమ్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటిస్తుంది. సాహిత్యంలో నోబెల్ బహుమతిని అక్టోబర్ 9న స్టాక్హోమ్ నుంచే ప్రకటించనున్నారు. తరువాత 10వ తేదీన నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తారు. ఇంతకీ ఈ నోబెల్ బహుమతి ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఎప్పటి నుంచి వీటిని ప్రదానం చేస్తున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Ari Trailer : ఇంకా కావాలనిపిస్తుంది.. అనసూయ కొత్త సినిమా ట్రైలర్ చూశారా
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ఎప్పుడు ప్రారంభించారంటే..
ప్రముఖ వ్యాపారవేత్త, శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణం తరువాత ఈ నోబెల్ బహుమతులు అందజేస్తున్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 10న నోబెల్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి. ఈ రోజున నోబెల్ బహుమతులు గ్రహీతలకు ప్రదానం చేస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ తన సంపదలో ఎక్కువ భాగాన్ని వివిధ రంగాలలో బహుమతులను అందజేయడానికి వీలునామా రాశారు. 1895 నాటి ఆయన వీలునామా ప్రకారం.. “గత ఏడాదిలో, మానవాళికి గొప్ప ప్రయోజనం చేకూర్చిన వారికి” బహుమతులు ప్రదానం చేయాలని ఆయన నిర్దేశించారు. మొదటి నోబెల్ బహుమతులు 1901లో ప్రదానం చేశారు. నాటి నుంచి ఏటా అందజేస్తున్నారు. అప్పటి నుంచి కొన్ని సార్లు నోబెల్ బహుమతులు ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు కొనసాగింది. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు కొనసాగిన సమయంలో నోబెల్ బహుమతులు ఇవ్వలేదు.
నోబెల్ బహుమతి విభాగాలు భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, శరీరధర్మ శాస్త్రం లేదా వైద్యం, సాహిత్యం, శాంతి – ఇవన్నీ ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాలో పేర్కొన్నారు. 1968లో స్వీడిష్ సెంట్రల్ బ్యాంక్ ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఆర్థిక శాస్త్రంలో స్వీడిష్ రిక్స్బ్యాంక్ బహుమతిని ఏర్పాటు చేసింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ తన వీలునామాలో నోబెల్ బహుమతి విజేతలను ఎంపిక చేయడానికి ఎవరు బాధ్యత వహించాలో పేర్కొన్నారు. ఈ అవార్డులను స్వీడిష్ సంస్థలు ప్రదానం చేస్తాయి. అయితే నోబెల్ శాంతి బహుమతిని మాత్రం నార్వేజియన్ పార్లమెంట్ ఎన్నుకున్న ఐదుగురు సభ్యుల కమిటీ నిర్ణయించిన వ్యక్తికి ప్రదానం చేస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ జీవితకాలంలో స్వీడన్, నార్వే ఒకే యూనియన్లో భాగంగా ఉండేవి. ఇక్కడ విశేషం ఏమిటంటే నోబెల్ బహుమతుల అధికారిక వెబ్సైట్ కూడా నోబెల్ బహుమతులు నార్వేలో మాత్రమే ఎందుకు ప్రదానం చేస్తారో వివరించలేదు. బహుమతి కమిటీ ఓస్లోలో ఉన్న కారణంగా, బహుమతులు కూడా అక్కడే ప్రదానం చేస్తారని అది పేర్కొంది.
ఎంత మందిని నామినేట్ చేయవచ్చు..
నోబెల్ బహుమతిని గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు పంచుకోవచ్చు. శాంతి బహుమతి విషయంలో బహుమతిని ఒక సంస్థకు కూడా ప్రదానం చేయవచ్చు. బహుమతిని ముగ్గురికి మాత్రమే ప్రదానం చేయాలనే నియమం నోబెల్ ఫౌండేషన్ శాసనాల నుంచి వచ్చింది. ఇది నోబెల్ వీలునామా ప్రయోజనాలను నెరవేర్చడానికి బాధ్యత వహిస్తుంది. ఇవి స్పష్టంగా ఇలా చెబుతున్నాయి.. “ఎట్టి పరిస్థితుల్లోనూ బహుమతి డబ్బును ముగ్గురు కంటే ఎక్కువ మంది వ్యక్తులకు విభజించకూడదు.” బహుమతుల ప్రదానానికి వ్యక్తులను ఎంపిక చేసే ప్రతి బహుమతి కమిటీ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. కానీ అవన్నీ ఆల్ఫ్రెడ్ నోబెల్ “మానవజాతికి గొప్ప ప్రయోజనాన్ని అందించిన వారికి బహుమతి ఇవ్వాలి” అనే నిబంధనలకు లోబడ పని చేస్తాయి.
చనిపోయిన వారికి బహుమతి ప్రదానం చేస్తారా..
మరణానంతరం నోబెల్ బహుమతిని ప్రదానం చేయడం సాధ్యం కాదు. అయితే 1974 నుంచి బహుమతి ప్రకటించిన తర్వాత విజేత మరణిస్తే ఈ అవార్డు ఇస్తున్నారు. గతంలో ఎరిక్ యాక్సెల్ కార్ల్ఫెల్డ్ట్ (సాహిత్యంలో నోబెల్ బహుమతి 1931), డాగ్ హమ్మర్స్క్జోల్డ్ (శాంతిలో నోబెల్ బహుమతి 1961) కేసుల మాదిరిగానే, అదే ఏడాది ఫిబ్రవరి 1 కి ముందు నామినేషన్ చేసిన ఒక వ్యక్తికి మరణానంతరం బహుమతిని ప్రదానం చేసేవారు. 2011లో మెడిసిన్ నోబెల్ బహుమతి ప్రకటించిన తర్వాత బహుమతి గ్రహీతలలో ఒకరైన రాల్ఫ్ స్టెయిన్మాన్ బహుమతి ప్రదానానికి మూడు రోజుల ముందే మరణించారని తెలిసింది. నోబెల్ ఫౌండేషన్ బోర్డు శాసనాలను పరిశీలించి, కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ అసెంబ్లీ ఆయన మరణం గురించి తెలియకుండానే 2011లో మెడిసిన్ నోబెల్ బహుమతిని ప్రకటించిన కారణంగా రాల్ఫ్ స్టెయిన్మాన్ నోబెల్ గ్రహీతగానే ఉండాలని నిర్ధారించింది.
50 ఏళ్ల వరకు చెప్పాల్సిన అవసరం లేదు..
నోబెల్ ఫౌండేషన్ నియమాల ప్రకారం.. నామినేషన్ల గురించి సమాచారాన్ని 50 ఏళ్ల పాటు బహిరంగంగా లేదా ప్రైవేట్గా బహిర్గతం చేయకూడదు. ఈ పరిమితి నామినీలు, నామినేటర్లకు మాత్రమే కాకుండా, బహుమతి ప్రదానంకు సంబంధించిన పరిశోధనలు, అభిప్రాయాలకు కూడా వర్తిస్తుంది.
బహుమతి డబ్బు ఎంతో తెలుసా..
ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించినప్పుడు ఆయన తన సంపదలో ఎక్కువ భాగాన్ని నోబెల్ బహుమతులను స్థాపించడానికి వీలునామా రాశారు. ఆ డబ్బును ఒక నిధిగా మార్చి భద్రతా బాండ్లలో పెట్టుబడి పెట్టమని ఆయన కోరారు. నేడు ఆ డబ్బుపై వచ్చే వడ్డీని నోబెల్ బహుమతులకు నిధులు సమకూర్చడానికి ఉపయోగిస్తున్నారు. పూర్తి నోబెల్ బహుమతి బహుమతి డబ్బు ప్రస్తుతం ఒక్కో అవార్డుకు 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ (SEK)గా ఉంది. ఇది 2023 చివరి నాటికి దాదాపు US$1.2 మిలియన్లకు సమానం. గ్రహీతలు ఈ మొత్తం డబ్బుతో పాటు డిప్లొమా, 18 క్యారెట్ల బంగారు పతకాన్ని అందుకుంటారు.
READ ALSO: Nobel Prize 2025: ట్రంప్ను నోబెల్ బహుమతికి దూరం చేసిన 10 కారణాలు..
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..