UPI: రూ. 2000 కు మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారా?.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
- రూ. 2000 కు మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారా
- క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిజిటల్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చెల్లింపుల స్వరూపమే మారిపోయింది. కిరాణా షాపు నుంచి మొదలుకుని షాపింగ్ మాల్స్ వరకు అన్నింటికి ఆన్ లైన్ ద్వారానే చెల్లింపుల చేస్తున్నారు. అయితే కొన్ని రోజుల నుంచి రూ. 2000 కు మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారు అనే ఊహాగానాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 2000 రూపాయలకు మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ఆలోచన ప్రభుత్వం వద్ద లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో స్పష్టం చేసింది . రూ. 2000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించాలనే జీఎస్టీ కౌన్సిల్ నుంచి ఎటువంటి సిఫార్సు లేదని జూలై 22న రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు.
Also Read:Mothevari Love Story : ‘మోతెవరి లవ్ స్టోరీ’ ట్రైలర్ రిలీజ్
Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
2000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందా అనే ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, జీఎస్టీ రేట్లు, మినహాయింపులు జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల ఆధారంగా నిర్ణయించబడతాయని సభకు తెలిపారు. కర్ణాటకలోని వ్యాపారులకు యూపీఐ లావాదేవీల డేటా ఆధారంగా జీఎస్టీ డిమాండ్ నోటీసులు అందిన తర్వాత ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ వివరణ ఇచ్చారు. కర్ణాటకలోని చిన్న వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ నోటీసులు జారీ చేసిందని, ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గత వారం తెలిపారు.
Also Read:AP Rains: రాష్ట్రంలో రేపు, ఎల్లుండి మోస్తారు వర్షాలు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ప్రకటనను జోషి చాలా హాస్యాస్పదంగా అభివర్ణించారు. నోటీసు జారీ చేయడంలో రాష్ట్రానికి ఎటువంటి పాత్ర లేదని డికె శివకుమార్ వెల్లడించారు. “చిన్న వ్యాపారులకు జిఎస్టి బకాయిల నోటీసులు జారీ చేసింది కర్ణాటక వాణిజ్య పన్ను అధికారులే. అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాని ప్రమేయం లేదని నటిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఇది బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదు.
Also Read:AP Rains: రాష్ట్రంలో రేపు, ఎల్లుండి మోస్తారు వర్షాలు
కేంద్ర ప్రభుత్వం జిఎస్టి నోటీసులు జారీ చేసి ఉంటే, అనేక ఇతర రాష్ట్రాల వ్యాపారులకు అవి అందేవి. అయితే, ఇది మరెక్కడా జరగలేదు. ఈ నోటీసులు కర్ణాటకలో మాత్రమే ఎందుకు పంపబడుతున్నాయి?” అని జోషి ప్రశ్నించారు. జీఎస్టీలో రెండు భాగాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు – కేంద్ర ప్రభుత్వం కింద సీజీఎస్టీ (సెంట్రల్ జీఎస్టీ), రాష్ట్ర ప్రభుత్వాల కింద ఎస్జీఎస్టీ (స్టేట్ జీఎస్టీ). జీఎస్టీ కౌన్సిల్ కేంద్ర, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులతో కూడిన రాజ్యాంగ సంస్థ. కర్ణాటకలోని చిన్న వ్యాపారులకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నోటీసులు జారీ చేసింది.
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!