Hyderabad Police: హైదరాబాద్లో ఫ్రెండ్లీ పోలీస్ లేదు.. రాత్రి 10:30 దాటితే లాఠీ పోలీసే..
- హైదరాబాద్లో ఫ్రెండ్లీ పోలీస్ లేదు
- రాత్రి 10:30 దాటితే లాఠీ పోలీసే ఉంటుందని పోలీసుల ప్రకటన
- రాత్రి 10:30 గంటలకు వ్యాపార సముదాయాలు మూసివేయాలని ఆదేశం
- కఠినంగా వ్యవహరించాలని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Police: హైదరాబాద్లో రాత్రి సమయంలో ఫ్రెండ్లీ పోలిసింగ్ ఉండదని హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాత్రి 10.30 దాటితే నో ఫ్రెండ్లీ పోలీస్.. ఓన్లీ లాఠీ ఛార్జ్ పోలీస్ అని పోలీసులు ప్రకటిస్తున్నారు. రాత్రి 10:30 గంటలకు వ్యాపార సముదాయాలు మూసివేయాలని ఆదేశించారు. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ చేస్తూ పోలీసులు ప్రకటన చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాత్రి 10:30 గంటల నుంచి 11 గంటలలోపే పాతబస్తీలో పాన్ షాపులు,హోటళ్లు మూసేయాలని మైక్లో పోలీసులు తెలిపారు.
రాత్రుళ్లు అనవసరంగా వీధుల్లో తిరగొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాత్రిళ్లు ముక్కుముఖం తెలియని వారికి లిఫ్ట్ ఇవ్వొద్దని అన్నారు. రాత్రుళ్లు పబ్లిక్ ప్రాంతాల్లో మద్యం తాగేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో ఇకపై రాత్రి 10.30 లోపు షాపులు బంద్.. హోటల్స్, బట్టల దుకాణాలు ఇలా అన్నీ మూసేయల్సిందే.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్ష అనంతరం సీఎం సూచనల మేరకు పోలీసుల ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వరుస సంఘటనలతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గస్తీని పెంచారు. పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు జరగడంతో కఠినంగా వ్యవహరించాలని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. నగరంలో ఆఫీస్లు రాత్రి 11 గంటలకు ముగుస్తాయని, ఆ సమయంలో డిన్నర్ ఎక్కడ చేయాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి కొంత మంది నెటిజన్లు పోలీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
నో ఫ్రెండ్లీ పోలీస్ ఓన్లీ లాఠీ పోలీస్పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత బస్తీలోనే పోలీసులు ఎందుకిలా ప్రకటనలు చేస్తున్నారని ప్రశ్నించారు. అదే జూబ్లీహిల్స్లో ఇలాంటి ప్రకటనలు పోలీసులు ధైర్యంగా చేయగలరా అంటూ పేర్కొన్నారు. వ్యాపార సముదాయాలను రాత్రి 12 గంటల వరకు అనుమతించాలని ఆయన కోరారు. ఇప్పటికే పలు మెట్రో నగరాల్లో రాత్రి 12 గంటల వరకు వ్యాపారానికి అనుమతిస్తున్నారని.. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతిందని ..రాత్రి వ్యాపారాన్ని అనుమతిస్తే సమస్య ఏంటని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..