సస్పెన్షన్కు గురైన జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లి, ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. మైసూరు జిల్లాలోని కేఆర్ నగర్లో ఓ మహిళ కిడ్నాప్కు సంబంధించిన కేసులో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కోడలు భవానీ బుధవారం ముందస్తు బెయిల్ను కోరింది. ఈ క్రమంలో ఆ పిటిషన్ను స్థానిక కోర్టు తిరస్కరించింది.
ఓ మహిళ కిడ్నాప్కు సంబంధించిన కేసులో భవానీ రేవణ్ణ భర్త.. ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం అతను బెయిల్పై బయట ఉన్నారు. విచారణలో పాల్గొనాల్సిందిగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసు జారీ చేయడంతో భవానీ కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే అరెస్టయిన నిందితుడి వాంగ్మూలాల ఆధారంగా నోటీసులిచ్చింది.
Krithi Shetty : అలాంటి పాత్రలను చేయాలని వుంది..
ప్రజ్వల్ రేవణ్ణ, హెచ్డి రేవణ్ణలపై అత్యాచారం, లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసులను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) భవానీ పిటిషన్పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పనిమనిషి కిడ్నాప్లో భవానీ రేవణ్ణ పాత్రపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సిట్ పేర్కొంది. భవానీ రేవణ్ణ, ఆమె కుటుంబ సభ్యులు చాలా ప్రభావవంతమైన వారని, సాక్ష్యాలను తారుమారు చేసి బాధితులు, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిట్ పేర్కొంది.
విచారణ సందర్భంగా జస్టిస్ సంతోష్ గజానన భట్ వాదనలు వినిపిస్తూ భవానీ రేవణ్ణ బెయిల్ పిటిషన్ను తిరస్కరించారు. ప్రజ్వల్ రేవణ్ణ తన తల్లిని లైంగికంగా వేధించాడని ఆ మహిళ కొడుకు ఫిర్యాదు మేరకు గత నెలలో కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ కేసు బహిరంగం కావడంతో జెడి(ఎస్) ఎంపికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా మహిళను అపహరించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.