Nigeria : నైజీరియాలో బోకోహరమ్ ఉగ్రదాడి..100 మందికి పైగా మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nigeria : ఈశాన్య నైజీరియాలో అనుమానిత బోకో హరామ్ తీవ్రవాదులు ఘోరమైన దాడికి పాల్పడ్డారు. కనీసం 100 మంది గ్రామస్థులు మరణించారు. ఈ సంఘటన ఆదివారం యోబెలోని తర్మువా కౌన్సిల్ ప్రాంతంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 50 మందికి పైగా ఉగ్రమూకలు బైక్లపై వచ్చి తొలుత కాల్పులు జరిపి ఆ తర్వాత భవనానికి నిప్పంటించారు. ఈ దాడిలో 34 మంది మరణించారని యోబే డిప్యూటీ గవర్నర్ ఇడి బర్డే గుబానా తెలిపారు. అయితే స్థానిక నేత జానా ఒమర్ ప్రకారం వాస్తవ సంఖ్య 102. అధికారులు రాకముందే చాలా మందిని ఖననం చేశారని లేదా వారి మృతదేహాలను ఇతర ప్రాంతాలకు తరలించారని ఆయన అన్నారు. ఇంకా చాలా మంది గల్లంతయ్యారని, వారి కోసం అన్వేషణ కొనసాగుతోందని ఉమర్ చెప్పారు.
Read Also:Varaha Jayanti: వరాహ జయంతి శుభవేళ ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ కుటుంబం,వ్యాపారం అంతా బాగుంటుంది
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
అత్యంత ఘోరమైన దాడులలో ఒకటి
ఈ దాడికి బాధ్యత వహిస్తూ, గ్రామస్థులు తమ కార్యకలాపాల గురించి భద్రతా సిబ్బందికి సమాచారం అందించినందుకు ప్రతీకారంగా ఈ చర్య తీసుకున్నట్లు ఉగ్రవాదులు తెలిపారు. నైజీరియాలో పెరుగుతున్న అభద్రత, తీవ్రవాద పరిస్థితిని ప్రతిబింబించే ఈ దాడి గత సంవత్సరంలో జరిగిన ఘోరమైన దాడులలో ఒకటిగా పరిగణించబడుతుంది.
Read Also:Paralympics 2024: పారాలింపిక్స్లో నేటి భారత షెడ్యూల్ ఇదే!
బోకో హరామ్ అంటే ఏమిటి?
బోకో హరామ్ ఒక ఇస్లామిక్ తీవ్రవాద సమూహం. ఇది 2002లో స్థాపించబడింది. నైజీరియాలో షరియా చట్టాన్ని అమలు చేయడం, పాశ్చాత్య విద్యను వ్యతిరేకించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ గుంపు గత 10 సంవత్సరాలలో వేలాది మందిని చంపింది. లక్షల మందిని నిర్వాసితులను చేసింది. బోకోహరమ్ దాడులు గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పాఠశాలలు, మత స్థలాలపై కూడా జరుగుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన, అభద్రతా వాతావరణం నెలకొంది. నైజీరియా ప్రభుత్వం, భద్రతా దళాలు ఈ సమస్యను ఎదుర్కోవటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి, అయితే పరిస్థితిని మెరుగుపరచడం కష్టంగా మారుతోంది. స్థానిక సంఘాలకు భద్రత కల్పించడంతోపాటు దాడులు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!